Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్లోనూ పెట్టుబడుల వరద కొనసాగుతుంది. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జిఐసి, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిపిజి క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ విభాగంలో రూ.7,350 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. రిలయన్స్ రిటైల్లో 1.22 శాతం వాటా కోసం జిఐసి రూ.5,512.5 కోట్లు, 0.41 శాతం వాటా కోసం టిపిజి రూ.1,837.5 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టన్నాయి. దీంతో రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకు 7.28 శాతం వాటా విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల నిధులను సమీకర్చుకున్నట్లయ్యింది.