Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజినెస్ బ్యూరో
ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ప్రతీ ఏడాది అక్టోబర్ 2 నుంచి 8వ తేదిల్లో 'దానోత్సవ వారం' (జారు ఆఫ్ గివింగ్ వీక్) నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఎస్బిఐ అమరావతి సర్కిల్ ఆఫీసు చీఫ్ జనరల్ మేనేజర్ సంజరు సహారు 15 అట్టపెట్టల నిండ బట్టల (వస్త్రాల)ను ఆదరణ హోమ్ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ శ్రీ జాడి మాదవ రావ్కు అందజేసినట్లు ఎస్బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆదరణ హోమ్ ముఖ్యంగా 100 మందికి పైగా అనాథ, నిరుపేద పిల్లలకు అహారం, నివాసం, విద్యను కల్పిస్తుంది. మనకున్నదానిలో సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ 'దానోత్సవ వారం' ప్రోత్సాహిక కార్యక్రమం చేపట్టామని సంజరు సహారు తెలిపారు. అమరావతి సర్కిల్లోని తమ అన్ని కార్యాలయాలు, శాఖలు చేపట్టిన ఇలాంటి ప్రోత్సాహాక కార్యక్రమాలను అభినందించారు. ఎస్బిఐ అమరావతి సర్కిల్లో పని చేసే 700 మంది ఉద్యోగులు ఈ వితరణలో భాగస్వాములు అయ్యారని ఆ సంస్థ తెలిపింది. ఆదరణ హోమ్కు చేసిన సాయం కార్యక్రమంలో జిఎం (ఎన్డబ్ల్యు-కోస్టల్) మనికంఠన్, జిఎం (ఎన్డబ్ల్యు-రాయలసీమ) వినిత భట్టచార్జీ, జిఎం (ఎన్డబ్ల్యు-ఎఫ్ఐఎంఎం) ఖాద్రీ గుండు రావ్, డిజిఎం అండ్ సిడిఒ వి. ప్రేమ్జీ, ఎజిఎం (పిఆర్అండ్సిఎస్బి) శ్రీ డిజె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.