Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఎంఎస్ఎంఈ ప్రోత్సహ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించింది. బ్యాంకులోని ఇతర ఉత్పత్తులతో పాటు కేంద్ర ఎంఎస్ఎంఈ సువిధ వంటి ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు యూనియన్ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్ఎంఈ మల్లాపుర్ బ్రాంచ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాంకు సికింద్రాబాద్, రీజినల్ ఉన్నతాధికారి శ్రీ ఎస్ శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. డిఆర్హెచ్ శ్రీ ఎస్ ప్రకాశ్రావు, ఎంఐయూడబ్ల్యూఏ అధ్యక్షులు శ్రీ కిషన్ చంద్ర, బ్రాంచ్ హెడ్స్, మల్లాపూర్ ఎంఎస్ఎంఈ ఖాతాదారులు, ఇతరులు పాల్గొన్నారు. ఖాతాదారులతో రీజినల్ ఉన్నతాధికారి ఈ సందర్భంగా మాట్లాడారు. వివిధ ఎంఎస్ఎంఈ పథకాల ద్వారా ఈ రంగానికి బ్యాంకు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దాదాపు 50 మందికి పైగా ఖాతాదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బ్యాంకు సేవలపట్ల సంతృప్తి వ్యక్తంచేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.