Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. అంతర్జాతీయంగా పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమ్మకాలు కొనసాగుతుండటంతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 136 పాయింట్లు లేదా 0.34 శాతం కోల్పోయి 39,614కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 11,642 వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 2.6 శాతం, నిఫ్టీ 2.4 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. వారాంతం రోజున బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.62 శాతం, స్మాల్ క్యాప్ 0.03 శాతం చొప్పున తగ్గాయి.