Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటాల విక్రయానికి బిడ్ల అహ్వానం
న్యూఢిల్లీ : తీవ్ర అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనీల్ అంబానీ తన కీలక కంపెనీల్లోని వాటాలను అమ్మకానికి పెట్టారని తెలుస్తోంది. ఆసక్తి కలిగిన వారి నుంచి బిడ్లను అహ్వానిస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు తెలిపారు. రిలయన్స్ కాపిటల్ లిమిటెడ్లో భాగమైన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ ఫైనాన్సీయల్ లిమిటెడ్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ తదితర వాటిలో వాటాలను విక్రయించడం ద్వారా రూ.20వేల కోట్ల రుణాలు తిరిగి చెల్లించనున్నట్టు రిలయన్స్ గ్రూపు వర్గాలు తెలిపాయి. రుణదాతల నుంచి వేల కోట్ల అప్పులు పొంది తిరిగి చెల్లించడంలో విఫలమైన అనీల్ అంబానీ ఆస్తులను బ్యాంక్లు వేలం వేయడం లేదా విక్రయించనున్నాయనే వార్తలు జాతీయ మీడియాతో చక్కర్లు కొట్టాయి. దీంతో పరువు పోతుందనే ఉద్దేశంతో తామే వాటాలను విక్రయిస్తున్నట్టు అంబానీ కంపెనీ వర్గాలు సోమవారం మీడియాకు లీకులు ఇచ్చాయి. ఇప్పటికే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి వైదొలగాలని సెప్టెంబర్ 30న నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. తాజాగా రిలయన్స్ నిప్పన్లోని తమ 51 శాతం వాటాను కూడా విక్రయానికి పెట్టింది. ఇందులో జపాన్ కంపెనీ నిప్పన్ లైఫ్కు 49 శాతం వాటా ఉంది. గడిచిన సెప్టెంబర్ 30 నాటికి ఈ బీమా కంపెనీ రూ.21,912 కోట్ల ఆస్తుల నిర్వహణ కలిగి ఉంది. రిలయన్స్ సెక్యూరిటీస్లోనూ 100 శాతం వాటాను విక్రయానికి పెట్టింది.