Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ రమేష్ లక్ష్మీనారాయణన్ను తమ నూతన గ్రూప్ హెడ్– ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా నియమించింది. రమేష్కు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) హోదాను అందించారు మరియు ఈయన బ్యాంక్ యొక్క సాంకేతిక రూపాంతర ప్రయాణాన్ని తరువాత దశకు తీసుకువెళ్లేందుకు బాధ్యత వహిస్తారు. బ్యాంకు వద్ద విభిన్నమైన విభాగాలలో ఆయన బాధ్యతలు ఉంటాయి. సాంకేతిక వ్యూహాలకు ఆయన బాధ్యత వహించడంతో పాటుగా వ్యవస్థాపక సాంకేతికతను బలోపేతం చేయడం, డిజిటల్ సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు నూతన తరపు ఏఐ/ఎంఎల్ సాంకేతిక పరిష్కారాలను బ్యాంక్ కోసం తీర్చిదిద్దడం చేయనున్నారు.
క్రిసిల్ నుంచి రమేష్ బ్యాంక్లో చేరారు. క్రిసిల్ వద్ద మూడు సంవత్సరాల పాటు చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా రమేష్ విధులు నిర్వహించారు. ఈ బాధ్యతలలో భాగంగా క్రిసిల్ యొక్క వ్యాపారాలను సాంకేతికత, డాటా మరియు ఎనలిటిక్స్పై ఆధారపడి మార్చారు. ఆయన క్రిసిల్లో బిగ్ డాటా మరియు ఎనలిటిక్స్ స్టార్టప్ – ప్రాగ్మాట్రిక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో బాధ్యతలు నిర్వర్తించిన తరువాత చేరారు. నిజానికి ఈ సంస్ధను ఆయన సహ వ్యవస్ధాపించారు. 2017లో క్రిసిల్ సంస్థ దానిని సొంతం చేసుకుంది. దాదాపు 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రమేష్, పలు సంస్థలలో నాయకత్వ స్థానాలను నిర్వహించారు. ఆయన తన విధులను నిర్వహించిన సంస్థలలో సిటీబ్యాంక్, ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్, కోటక్ మహీంద్రా గ్రూప్ వంటివి ఉన్నాయి. ముంబై యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్లో బ్యాచులర్ డిగ్రీ కలిగిన రమేష్ అనంతరం యూనివర్శిటీ ఆఫ్ పూనె నుంచి ఎంబీఏ చేశారు. క్రికెట్ను విపరీతంగా అభిమానించే రమేష్ , భారతీయ సినీ సంగీతాన్ని కూడా అధికంగా ఆస్వాదిస్తుంటారు. ‘‘రమేష్ మాతో కలువడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం’’ అని శ్రీ భావేష్ జవేరీ, కంట్రీ హెడ్– ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్నారు. ‘‘రమేష్ తనతో పాటుగా ఆసక్తికరంగా ప్రొఫెషనల్ నైపుణ్యంతో పాటుగా స్టార్టప్ను నడుపడం ద్వారా సంపాదించిన వ్యవస్ధాపక చతురతను సైతం తీసుకువచ్చారు. వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడానికి, సామర్థ్యాలను పొందడానికి మరియు తరువాత దశ వృద్ధి దిశగా పయనించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనే మా తపనకు ఆయన అనుభవం, నైపుణ్యం మాకెంతగానో ప్రయోజనం చేకూరుస్తాయని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు.
‘‘భారతదేశంలో సుప్రసిద్ధ ప్రైవేట్ బ్యాంక్లో నా నూతన ఇన్నింగ్స్ను ప్రారంభిస్తుండటం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను’’ అని శ్రీ రమేష్ అన్నారు.‘‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద, వినియోగదారుల కోసం ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరచడమనేది నిరంతర ప్రక్రియ. సాంకేతికత, నూతన డిజిటల్ వేదికలు, డాటా మరియు ఎనలిటిక్స్ పట్ల నా అనుభవం మరియు అవగాహన ఉపయోగించకోవడంతో పాటుగా సాంకేతిక వినియోగంలో బ్యాంక్ తన అగ్రస్ధానాన్ని నిలుపుకునేందుకు భరోసా అందించగలనని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.