Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీదారు బిఎండబ్ల్యు భారత మార్కెట్లోకి కొత్త ఎక్స్5ఎం కాంపిటీషన్ను విడుదల చేసినట్టు ప్రకటించింది. ఈ స్పోర్ట్స్ ఆక్టివిటీ వెహికల్ (ఎస్ఏవీ) ఎక్స్షోరూం ధరను రూ.1.94 కోట్లుగా నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ వాహనం కేవలం 3.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం పుంజుకోనుందని తెలిపింది. అత్యాధునిక వి8 ఇంజిన్ను ఉపయోగించిన ఎక్స్5ఎం గంటకు గరిష్టంగా 250 కిలోమీటర్లు పరుగెత్తనున్నదని పేర్కొంది.