Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్లో మైనస్ 5.3 శాతం క్షీణత
ముంబయి : దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని మరో రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పుడు విధాన నిర్ణయాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు తగ్గాయి. బ్యాంక్లు ఇచ్చే రుణాల జారీపై ప్రభావం పడిందని ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత ఏడాది అక్టోబర్లో అహారేతర రుణాల జారీ ఏకంగా 5.6 శాతం ప్రతికూల వృద్థిని చవి చూసిందని ఆర్బీఐ వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో 8.3 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ముగిసిన అక్టోబర్లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాల జారీలో మాత్రం 7.4 శాతం వృద్థి నమోదయ్యిందని ఆర్బీఐ విడుదల చేసిన 'సెక్టోరల్ డెప్లారుమెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ - సెప్టెంబర్ 2020'లో వెల్లడించింది. గతేడాది ఇదే మాసంలో ఈ రంగ రుణాల్లో 7.1 శాతం పెరుగుదల ఉంది.
2020 అక్టోబర్లో పరిశ్రమ రుణాల జారీలో మైనస్ 1.7 శాతం పతనమయ్యాయి. గతేడాది ఇదే మాసంలో ఈ రంగ రుణాల్లో 3.4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. 2020 అక్టోబర్లో పెద్ద పరిశ్రమల రుణాల జారీలో మైనస్ 2.9 శాతం క్షీణతను చవి చూశాయి. 2019 ఇదే ఏడాది 4.2 శాతం వృద్థి నమోదయ్యింది. ఇదే సమయంలో మధ్యస్థ పరిశ్రమలకు ఇచ్చే అప్పుల్లో 1.2 శాతం పెరుగుదల ఉండగా.. గడిచిన అక్టోబర్లో ఏకంగా 16.7 శాతం వృద్థి చోటు చేసుకోవడం విశేషం.
అహారోత్పత్తుల ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు ఉత్పత్తులు, న్యూక్లీయర్ ఫ్యూయల్స్, తోలు, కాగితం, వాహనాలు, వాహన పరికరాలు, రవాణ పరికరాలు తదితర రంగాల రుణాల జారీలో పెరుగుదల నమోదయ్యిందని ఆర్బీఐ పేర్కొంది. మరోవైపు పానియాలు, పొగాకు, రబ్బర్ ప్లాస్టిక్, రసాయనాలు, సిమెంట్, ఇంజనీరింగ్, రత్నాలు, అభరణాలు, మౌలిక వసతులు, నిర్మాణ రంగాల రుణాల జారీలో ప్రతికూల వృద్థిని చవి చూశాయి. 2020 సెప్టెంబర్లోనూ పరిశ్రమ రుణాల జారీ శూన్య శాతంగా నమోదయ్యింది.