Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహేష్ సహకార బ్యాంకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదార్లకు 18 శాతం డివిడెండ్ను అందించనున్నట్లు ఆ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు 30వ సర్వసభ్య సమావేశంలో వాటాదార్లకు డివిడెండ్ను ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం 9.86 శాతం వృద్ధితో రూ.2,415.33 కోట్లకు చేరిందని పేర్కొంది. 2013-14లో వ్యాపారం 2,198.61 కోట్లుగా ఉంది. క్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో బ్యాంకు డిపాజిట్లు రూ.1,571.45 కోట్లు, రుణాలు రూ.843.88 కోట్ల చొప్పున నమోదయ్యాయి. పన్ను చెల్లింపునకు ముందు లాభం 10.28 శాతం పెరిగి రూ.26.49 కోట్లకు చేరిందని ఆ బ్యాంకు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2,800 కోట్ల వ్యాపారంతో రూ.28 కోట్ల లాభాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మహేశ్ బ్యాంకు చైర్మన్ పురుషోత్తమదాస్ మంధానా పేర్కొన్నారు. స్థూల నిరర్థక ఆస్తులను 3శాతం దిగువకు నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.