Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పాలకమండలి ఎన్నిక
నవతెలంగాణ - వాణిజ్యప్రతినిధి
సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన చైర్మెన్గా రమేష్ కుమార్ బంగ్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. డిసెంబర్ 20న రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్టర్ రాణి జాన్ ఆధ్వర్యం లో జరిగిన ఆ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికల తుది ఫలితాలను వెల్లడించారు. వైస్ చైర్మెన్గా పురుషోత్తమదాస్ మందానా, వైస్ ఛైర్మన్గా లక్ష్మీనారాయన్ రతి ఎన్నుకోబడ్డారు. ఈ 15 మంది బోర్డు సభ్యులు ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్నికైన సభ్యుల్లో భగవతి బల్దేవా, సీఎం మర్లిమనోహార్ పలోడ్, కైలాష్ నారాయన్ బి, గోవిండ్ నారాయన్ రతి, అనిత సోని, రామ్ ప్రకాశ్ బండారి, బ్రిజ్గోపాల్ అసవా, భగవన్ పన్సారి, పూష్పా బూబ్, అరుణ్ కుమార్ భంగడియా, బద్రి విశాల్ మండల్, ప్రేమ్ కుమార్ బజాజ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్ తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో 45 శాఖలతో విస్తరించి ఉంది. రమేష్ కుమార్ బంగ్ ఇంతక్రితం కూడా 2005-2010, 2010-2015 కాలంలో రెండు సార్లు చైర్మెన్గా పని చేసిన విశేష అనుభవంతో పాటుగా ఈ రంగంలో అనేక అవార్డులను అందుకున్నారు.