Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ వాటర్ ప్యూరిఫయర్ బ్రాండ్ అయినా యురేకా ఫోర్బ్స్ మార్కెట్లోకి ఆయుర్ఫ్రెష్ టెక్నలాజీతో సరికొత్త డా.అక్వాగార్డ్ను విడుదల చేసినట్టు వెల్లడించింది. దీనితో తాజా రుచి, సువాసన వస్తాయని పేర్కొంది. ఈ ప్యూరిఫయర్లలో ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నలాజీ ఉండటంతో ప్రతీ గ్లాస్ నీరులోనూ ఏడు ఆయుర్వేద ఔషధాల సుగుణాలు కలిగి ఉంటాయని వెల్లడించింది. ఇందులో రెండు కుళాయిలతో ఉండే ఎడ్జ్ ఆయుర్ ఫ్రెష్ ధరను రూ.25,999గా, రెండు డిస్పెన్సింగ్ బటన్లతో లభించే క్లాసిక్ ఆయుర్ఫ్రెష్ ధరను రూ.15,999గా నిర్ణయించినట్టు ఆ కంపెనీ తెలిపింది.