Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పలు కార్పొరేట్ కంపెనీలు డిసెంబర్ త్రైమాసికంలో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను నమోదు చేయడానికి తోడు అంతర్జాతీయ సానులకూల పరిణామాల మధ్య మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 834 పాయింట్లు పెరిగి 49,398కి చేరింది. దీంతో ఇంతక్రితం రెండు రోజుల నష్టాలను పూడ్చుకున్నట్లయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 239.85 పాయింట్లు రాణించి 14,521 వద్ద ముగిసింది. నిఫ్టీలోని 50 సూచీల్లో 46 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 2.3 శాతం, స్మాల్ క్యాప్ 1.6 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్ ఫినాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు గరిష్టంగా 3 - 6 శాతం మేర పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి.