Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడికె గ్లోబల్ కన్వర్జెన్స్లో ఎండి
హైదరాబాద్ : మహమ్మారి కారణంగా గడిచిన 2020 సంవత్సరం వినూత్నమైన సవాళ్లను ముందుంచడమే కాకుండా.. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధైర్యాన్ని పరీక్షించిందని సిడికె గ్లోబల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ చతుర్వేది పేర్కొన్నారు. ఈ ఐటి సేవల సంస్ధ తమ 6వ ఫ్యామిలీ డే కన్వర్జెన్స్ 2021ను తొలిసారిగా వర్ట్యువల్గా నిర్వహించింది. ఈ సందర్బంగా అరవింద్ మాట్లాడుతూ పలు కష్టాలున్నప్పటికీ తమ బృందం గతానికన్నా మిన్నగా ప్రదర్శన కనబర్చిందని ప్రశంసించారు. 2021లో మరింత ఉన్నత స్ధాయికి తమ బందం చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో 1400 మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారని ఆ సంస్థ పేర్కొంది.