Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓ నేషనల్ బ్యాంక్ను ఏర్పాటు చేయనుందని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెలువరించింది. అదే విధంగా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ ఫండ్స్ కొంత మొత్తాన్ని కచ్చితంగా ఈ బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్న షరతు కూడా విధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత రూ.20వేల కోట్లతో ప్రారంభించి.. అనంతరం రూ.1 లక్ష కోట్ల మూలధనం సమకూర్చనుందని సమాచారం. ఈ బ్యాంక్ను ఓ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.