Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు బ్యాంక్లను విలీనం చేసుకోగా.. వాటిలో ఐటి అనుసంధానం ద్వారా మరో మైలురాయిని చేరుకున్నట్లు ఆ బ్యాంక్ తెలిపింది. పూర్వ ఆంధ్రా బ్యాంక్కు చెందిన అన్ని శాఖల్లోనూ ఐటి ఏకీకృతం జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్, చెక్కులు 2021 మార్చి 31 వరకు మాత్రం ఉపయోగంలో ఉంటాయని తెలిపింది. యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్గా ఉంది. 9590 పైగా శాఖలు, 13,287 శాఖలతో విస్తరించి ఉంది.