Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ సాధారణ బీమా రంగంలోని ఓరియెంటల్ ఇన్సూరెన్స్ లేదా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ రెండింటిలో ఏదో ఒక సంస్థను కేంద్రం ప్రయివేటీకరించనుందని రిపోర్ట్లు వస్తోన్నాయి. నూతన బడ్జెట్లో ఒక బీమా కంపెనీ, రెండు బ్యాంక్లను విక్రయించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాంకుల ప్రయివేటీకరణ కోసం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే. బీమా రంగంలోని ఓరియంటల్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో వాటిని కార్పొరేట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చుతారని ప్రభుత్వ వర్గాలు భావిస్తోన్నాయి.