Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జీపీపీఎల్లో 25.51 శాతం వాటా స్వాధీనం
న్యూఢిల్లీ : విద్యుత్ను ఉత్పత్తి చేసే దబోల్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రయివేటు లిమిటెడ్ (ఆర్జీపీపీఎల్)లోని గెయిల్కు చెందిన 25.51 శాతం వాటాను మరో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ స్వాధీనం చేసుకుంది. ఈ వాటా కొనుగోలు తర్వాత ఆర్జీపీపీఎల్లో ఎన్టీపీసీ వాటా 86.49 శాతానికి చేరినట్లయ్యింది. తొలుత ఈ సంస్థలో ఎన్టీపీసీ, గెయిల్ సమానంగా 25.51 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. 2005లో ఈ సంస్థను ఇవే ఇరు సంస్థలు ఏర్పాటు చేశాయి.