Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వస్త్ర ఉత్పత్తులను విక్రయించే సోచ్ రాష్ట్రంలో 11 స్టోర్లకు విస్తరించినట్టు వెల్లడించింది. తాజాగా నిజామాబాద్లో నూతన స్టోర్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలో తమ రిటైల్ విక్రయాలు, బ్రాండ్ను బలోపేతం చేసుకోవడానికి దోహదం చేయనుందని సోచ్ అప్పెరల్స్ సీఈఓ వినరు చట్లానీ పేర్కొన్నారు. నూతన స్టోర్లో విస్తతశ్రేణిలో చీరలు, సల్వార్ సూట్లు, కుర్తాలు, టునిక్స్, కుర్తీ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ సిల్హ్యుటీస్, బ్రీజీ స్ట్రక్చర్స్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ తదితర వస్త్రాలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్లో లభిస్తాయన్నారు. 16 ఏండ్లుగా ఈ వ్యాపారంలో ఉన్న సోచ్కు దేశ వ్యాప్తంగా 48 నగరాల్లో 133 స్టోర్లను కలిగి ఉందన్నారు.