Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొమెడ్కె యుగెట్ మరియు యుని–గేజ్ ప్రవేశ పరీక్ష జూన్ 30,2021వ తేదీన ఉమ్మడి పరీక్షగా జరుగనుంది. ఈ ప్రవేశపరీక్షను కర్నాటక ప్రొఫెషనల్ కాలేజీస్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు యుని–గేజ్ సభ్య యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కాలేజీలలో బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించనున్నారు. ఈ పరీక్షను భారతదేశంలోని 150 నగరాలలో ఆన్లైన్ విధానంలో 400కు పైగా పరీక్షా కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఈ పరీక్షకు 80వేల మందికిపైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా. దరఖాస్తుదారులు www.comedk.org వద్ద లేదా www.unigauge.com వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో 22 మార్చి 2021 వ తేదీ నుంచి 20 మే 2021వ తేదీ వరకూ తెరిచి ఉంచబడుతుంది.
డాక్టర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, కొమెడ్కె మాట్లాడుతూ ‘‘ ఇంజినీరింగ్ విద్యలో అగ్రగామిగా కర్నాటక నిలుస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎల్లప్పుడూ ఇది కేంద్రంగానే నిలుస్తుంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా, కర్నాటక వెలుపల నుంచి ఈ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరుగుతుండటం చూస్తున్నాము. 2020లో మహమ్మారి కారణంగా అడ్మిషన్లలో కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ సంవత్సరం మాత్రం నిబంధనలను కాస్త సడలించడం వల్ల విద్యార్థుల ఆసక్తి మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని అన్నారు.
‘‘కొమెడ్ కె గత 15సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా సజావుగా ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం సైతం, మేము సురక్షితమైన రీతిలో పరీక్షలు మరియు ప్రవేశాలను నిర్వహించనున్నాం’’ అని డాక్టర్ కుమార్ వెల్లడించారు. ‘‘గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పటికీ మేము పరీక్షలను 392 కేంద్రాలలో అన్ని భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి నిర్వహించాం. విద్యార్థులు జిల్లాల పరిధిని దాటడాన్ని నివారిస్తూ మేము పరీక్షా కేంద్రాల సంఖ్యను సైతం వృద్ధి చేశాం. ఈ పరీక్షలను రెండు షిఫ్టులలో నిర్వహిస్తున్నాం. 2020లో దాదాపు 60వేల మంది విద్యార్థులను ఆకర్షించగలిగాం’’ అని పీ మురళీధర్, సీఈవో, ఎరా ఫౌండేషన్ అన్నారు. ఈ సంవత్సరం, మేము మా భద్రతా ప్రమాణాలను ఆధునీకరించాం. తద్వారా ప్రతి కేంద్రమూ పూర్తిగా శానిటైజ్ చేశామన్న భరోసా కల్పించడంతో పాటుగా భౌతిక దూర ప్రమాణాలకు భరోసానందిస్తూ కేవలం 50% సీటింగ్ మాత్రమే అనుమతిస్తున్నాం. పరీక్షా కేంద్రాల సంఖ్యను సైతం 392 నుంచి 400కు పైగా సెంటర్లకు 150 నగరాలలో విస్తరించాం. తద్వారా విద్యార్థులు ప్రయాణించే సమయాన్ని సైతం తగ్గించాం. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నాం. తొలి సెషన్ ఉదయం 9 గంటలకు ఆరంభమై 12 గంటలకు ముగిస్తే , రెండవ సెషన్ మధ్యాహ్నం 2గంటలకు ఆరంభమై 5 గంటలకు ముగుస్తుంది’’ అని అన్నారు.
కొమెడ్ కె –యుని–గేజ్ ఇప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద మల్టీ యూనివర్శిటీ ప్రైవేట్ ఇంజినీరింగ్ పరీక్ష. ఈ పరీక్ష స్కోర్ను 180కు పైగా ఇస్టిట్యూషన్లు, 30కు పైగా యూనివర్శిటీలు అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు 150కు పైగా నగరాలు, 400కు పైగా పరీక్షా కేంద్రాలకు చేరువకావడం ద్వారా ఇది గత కొద్ది సంవత్సరాలుగా మరింతగా ఆదరణ పొందుతుంది. ఈ మొత్తం దరఖాస్తు మరియు పరీక్ష ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుంది.
గమనిక: కోమెడ్కెకు ఒకే ఒక్క అధికారిక వెబ్సైట్ www.comedk.org విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఈ అంశాన్ని పరిశీలించడంతో పాటుగా సమాచారం, అప్డేట్స్, దరఖాస్తు ప్రక్రియకు సంబంధిత వివరాల కోసం అధికారిక వెబ్సైట్ మాత్రమే వినియోగించగలరు.
కొమెడ్ కె గురించి:
సభ్య సంస్థలలో ప్రవేశాలను కోరుకునే విద్యార్థుల యోగ్యతా ప్రమాణాలను గుర్తించేందుకు వైద్య, దంత, ఇంజినీరింగ్ ప్రైవేట్ కళాశాలల కన్సార్టియం ప్రారంభించిన మూల్యాంకన పరీక్ష కొమెడ్ –కె. ప్రతిభా వంతులైన విద్యార్థుల యోగ్యతను గుర్తించేందుకు సమర్థవంతమైన, పారదర్శక, అనుకూల వేదిక కొమెడ్కె (కర్నాటకలోని వైద్య, ఇంజినీరింగ్, దంత వైద్య కళాశాలల కన్సోర్టియం). ప్రస్తుతం దాదాపు 150 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20వేల సీట్లు కొమెడ్ కె కు అనుబంధంగా ఉన్నాయి మరియు 2020–2021 విద్యాసంవత్సరం కోసం యుజీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి ఈ పరీక్షా విధానాన్ని ఉపయోగించుకుంటున్నాయి. www.comedk.org
యుని–గేజ్ గురించి:
భారతదేశవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రైవేట్ మరియు డీమ్డ్ యూనివర్శిటీల వద్ద అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో ప్రవేశం కోసం ఆన్లైన్ ప్రవేశ పరీక్ష వేదిక యుని–గేజ్. లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ ఎరా ఫౌండేషన్ ఈ యుని–గేజ్ను నిర్వహిస్తుంది. ఆరంభించిన నాటి నుంచి ఎరా ఫౌండేషన్, విద్యారంగ సంపూర్ణ అభివృద్ధి మరియు భారతదేశంలో ఉన్నత విద్యారంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ఎరా ఫౌండేషన్ సమగ్రమైన రీతిలో అప్టిట్యూడ్ ఎస్సెస్మెంట్ను ప్రొఫెషనల్/ఉన్నత విద్య కోసం ప్రవేశార్థుల కోసం నిర్వహిస్తుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ సమగ్రంగా ఫౌండేషన్ నైపుణ్యాలు (కనీస సబ్జెక్ట్ నాలెడ్జ్) మరియు ఉన్నత విద్య నైపుణ్యాలైనటువంటి అప్టిట్యూడ్, వ్యక్తిత్వం మరియు ఆసక్తులను పరిశీలిస్తుంది. ఈ అందుబాటు ధరలలోని ఎస్సెస్మెంట్ అభ్యర్థికి కేవలం 1000 రూపాయలు (వెయ్యి రూపాయలు మాత్రమే) మరియు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా సీఎస్ఆర్ నిధుల మద్దతుతో లభిస్తుంది.