Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి–మార్చి త్రైమాసంలో గృహ విక్రయాలు 12% వృద్ధి చెందాయి
ఢిల్లీ: కొనుగోలుదారులలో విశ్వాసం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు సానుకూల ఫలితాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో గృహ విక్రయాలు ఎనిమిది ప్రధాన గృహ మార్కెట్లలో వృద్ధి కనిపించింది. ఇది 2021 సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసంలో 12% వృద్ధిని, 2020 సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసంతో పోలిస్తే నమోదు చేసిందని ప్రోపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ నివేదికలో వెల్లడించింది. రియల్ ఇన్సైట్ క్యు 1 సీవై21 ప్రకారం, బిల్డర్లు మొత్తం మ్మీద 66,176 గృహాలను జనవరి–మార్చి త్రైమాసం 2021లో ప్రైమరీ మార్కెట్లలో విక్రయించారు. మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీతో పాటుగా సర్కిల్ రేట్ తగ్గింపులను చేయడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ వృద్ధి చెందడంతో పాటుగా గృహ విక్రయాలపై కూడా ప్రభావం చూపింది.
క్యు1సీవై 20తో పోల్చినప్పుడు, ఈ విశ్లేషణలో పేర్కొనబడిన మార్కెట్లలో 5% తగ్గుదల కనిపించింది. క్యు1 సీవై 20లో 69,555 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ తగ్గుదల స్వల్పమే. ఎందుకంటే భారతదేశంలో మహమ్మారి ఆరంభం కావడానికి చివరి త్రైమాసంగా జనవరి–మార్చి 2020 ను భావిస్తున్నారు. మార్చి 2020 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రభుత్వం ఆరంభించింది. తద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంబించిపోయాయి.
‘‘ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ఆలోచనాపరులు భారతదేశపు వృద్ధి అంచనాలను 2021 మరియు 2022 కోసం పునః సమీక్షించారు. దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సైతం ఇప్పుడు సానుకూలంగానే స్పందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు మరియు ఆర్బీఐ తో పాటుగా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ (గృహ ఋణ వడ్డీరేట్లు తగ్గింపు ద్వారా) తోడ్పాటునందించాయి. ఈ సానుకూల మార్పు మొదటి త్రైమాసంలో సరఫరా సంఖ్యలు పెరగడం ద్వారా కనిపించింది. లిక్విడిటీ మద్దతు మరియు కొనుగోలుదారుల సెంటిమెంట్ పరంగా డెవలర్లు ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉంటున్నారు. డిమాండ్ పరంగా కూడా అధికంగా స్థిరత్వం కనబడుతుంది. పలు పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ప్రోపర్టీ మార్కెట్లో ప్రయోజనాలను తీసుకునేందుకు తగిన విశ్వాసం కలిగిస్తుంది. వాస్తవానికి గృహ కొనుగోలుదారులకు అత్యంత అనుకూలమైన సంవత్సరంగా ఇదినిలుస్తుంది’’ అని ధృవ్ అగర్వాల, గ్రూప్ సీఈఓ, హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ మరియు ప్రాప్ టైగర్ డాట్ కామ్ అన్నారు.
‘‘ఇటీవలి కాలంలో కొన్ని మార్కెట్లలో కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నా, రెసిడెన్షియల్ మార్కెట్ రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని శ్రీ అగర్వాల జోడించారు.