Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఏకంగా 1,04,342 యూనిట్ల ఎగుమతులు చేసినట్లు వెల్లడించింది. చెన్నయ్ ప్లాంట్లో తయారయిన 10 మోడళ్లను నాలుగు ఖండాల్లోని 88 దేశాలకు వీటిని అందించినట్లు తెలిపింది. ఎస్యువి ఎగుమతుల్లో మార్కెట్ లీడర్గా ఉన్నట్లు తెలిపింది. ఐ20 మోడళ్లను ఆఫ్రికా, లాటిన్ అమెరికా రీజియన్లకు సరఫరా చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఖాతాదారులను సంతృప్తిపర్చుతూ నిర్వహణలో ఎక్సలెన్సీ ప్రదర్శిస్తున్నామని హెచ్ఎంఐఎల్ ఎండి, సిఇఒ ఎస్ఎస్ కిమ్ తెలిపారు.