Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ అభరణాల బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ తెలంగాణాలో కొత్తగా మూడు నూతన షోరూమ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వీటిని ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు అవుట్లెట్లు ఉన్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24న ఖమ్మం షోరూంను కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ వర్చువల్గా సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టిఎస్ కళ్యాణరామన్ ప్రారంభించనున్నారని పేర్కొంది. నూతన స్టోర్ ఏర్పాటు సందర్బంగా పలు రాయితీలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.