Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు కామన్ సర్వీసెస్ సెంటర్స్ (CSCs) నేడు గ్రామ స్థాయి వర్తకుల ద్వారా చివరి వరుసలో ఉన్న గ్రామీణ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు సిఎస్సి డిజిటల్ సర్వీస్ పోర్టల్ చాట్బోట్ ‘ఇవా’ను ప్రారంభించింది. ఇవా ద్వారా విఎల్ఇలు హెచ్డిఎఫ్సి బ్యాంకు అందిస్తున్న ప్రొడక్ట్స్ మరియు సేవల గురించి పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది మరియు అది చివరి వరుసలో ఉన్న వినియోగదారులకు సేవలను మరింత మెరుగుపరచనుంది.
ఈ 24/7 సేవలు విఎల్ఇలకు వివిధ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, ప్రక్రియల గురించి నిఖర సమాచారం మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకు సేవల గురించి విచారణను పరిష్కరించనుంది. విఎల్ఇలు ఖాతాను ప్రారంభించడం, లోన్ లీడ్ జనరేషన్ మరియు ఉత్పత్తి వివరాలతో వారి లావాదేవీలను మెరుగుపరచడం సాధ్యం చేస్తుంది. ఇవా ద్వారా విఎల్ఇలు బిజినెస్ కరస్పాండెంట్లుగా బాధ్యతలు నిర్వహించేందుకు శిక్షణ సమాచారం పొందగలుగుతారు. అంతే కాకుండా, నియంత్రణ ప్రక్రియకు అనుగుణంగా ప్రమాణ పత్రాన్ని అందుకునేందుకు ముందుగా క్విజ్లో పాల్గొంటారు.
ప్రస్తుతం 1,27,348 విఎల్ఇలు హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధిత సేవలను అందిస్తున్నాయి. వీటిలో 15,791 బిజినెస్ కరస్పాండెంట్లు వినియోగదారులకు భారతదేశ వ్యాప్తంగా 685 జిల్లాల్లో బ్యాంకింగ్ ఔట్లెట్ల ద్వారా సేవలను అందిస్తున్నారు. ఈ బిజినెస్ కరస్పాండెంట్లు గృహ రుణాలు, కార్ల రుణాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుకు రుణాలు, కరెంట్ మరియు పొదుపు ఖాతాల ప్రారంభించేందుకు మరియు రికరింగ్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా పొదుపు చేసేందుకు సహకారాన్ని అందిస్తారు. వీటిని విడుదల చేయడం గురించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గవర్నమెంట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ బిజినెస్ (GIB) గ్రూప్ హెడ్ స్మితా భగత్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం ఇండియా మరియు భారత్ మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు సహకరించనుంది. నగర భారతదేశం నేర్చుకోవడంలో అలాగే డిజిటల్ ప్రపంచాన్ని అలవర్చుకోవడంలో వేగాన్ని కలిగి ఉంది. గ్రామీణ భారతదేశంలో తక్కువ ఇంటర్నెట్ పరిధి నుంచి సవాళ్లను ఎదొర్కొంటున్నాయి. విఎల్ఇలు ఎక్కువ బ్యాంకింగ్ సేవల గురించి నేర్చుకునేందుకు మరియు ఇతరులకు మద్ధతు ఇవ్వడం ద్వారా వారి లావాదేవీలను మెరుగుపరచుకునేందుకు మార్పు తీసుకు వస్తుందని’’ తెలిపారు.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీప్ డిజిటల్ ఆఫీసర్ అంజని రాథోడ్ మాట్లాడుతూ ‘‘ఏఐ మరియు అనలిటిక్స్ నుంచి తయారుగా ఉండే ఇవా విచారణకు సమాధానాన్ని ఇచ్చే సమయాన్ని చాలా తక్కువ చేయనుంది. ఇది మా శ్రేణి సేవలను తెలియజేసేందుకు మరియు ఉత్పత్తికి సంబంధించిన ప్రశ్నలకు బదులిచ్చేందుకు మద్ధతు ఇవ్వడం ద్వారా విఎల్ఇలు మరియు వారి వినియోగదారులకు సులభమైన బ్యాంకింగ్ అనుభవాన్ని ఇస్తుందని’’ తెలిపారు. ఈ భాగస్వామ్యాన్ని విస్తరించిన సిఎస్సి ఎస్పివి మేనేజింగ్ డైరెక్టర్ డా.దినేశ్ త్యాగి మాట్లాడుతూ ‘‘హెచ్డిఎఫ్సి బ్యాంకుతో మా భాగస్వామ్యం విఎల్ఇలకు కొత్త కౌశల్యాలు మరియు ఉత్పత్తులు అలాగే సేవల గురించి జ్ఞానం పొందేందుకు తయారుగా ఉంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఆర్థిక సాధికారత కార్యసూచికను విస్తరిస్తుంది. డిజిటల్ ప్లాట్ఫారాలు మరియు ఆవిష్కరణలు విఎల్ఇలకు నిరంతరం కంపెనీలు, సేవలు మరియు ప్రజలకు నూతన అవకాశాలను ఆవిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని’’ తెలిపారు.
కామన్ సర్వీస్ సెంటర్ల గురించి
కామన్ సర్వీస్ సెంటర్స్ (CSCs) పథకం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని సుసాధ్యం చేసే ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. సిఎస్సిలు జి2సి, విద్య, ఆరోగ్య సువ, వ్యవసాయం మరియు ఆర్థిక సేవలను భారతదేశంలోని గ్రామాలకు అందుబాటులోకి తీసుకు వచ్చే ఇ-డెలివరీ అందుబాటులో ఉండే కేంద్రాలుగా ఉన్నాయి. వాటిని మార్పుకు ప్రతినిధులుగా రూపొందించగా, గ్రామీణ వ్యాపారశీలత మరియు గ్రామీణ సామర్థ్యాలు అలాగే జీవనోపాధి ఉపాయాలను నిర్మాణం చేస్తుంది. ఇది అఖిల భారత నెట్వర్కు కాగా, దేశంలోని ప్రాదేశిక, భౌగోళిక, భాష మరియు సాంస్కృతిక వైవిధ్యాలను అందించడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా మరియు డిజిటల్ విధానాలను అందుబాటులోకి తీసుకు రావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి సాధికారతను అందిస్తుంది.