Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్ దేశాలలో ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాలు మరియు పిల్లలను ఆదుకుంటున్న చిల్డ్రన్ ఇండియాకు సహకారాన్ని అందించేందుకు లెగో గ్రూప్ మరియు లెగో ఫౌండేషన్ సంయుక్తంగా వి1మిలియన్ అమెరికన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించాయి. ఈ నిధులను ఇటీవలి మహమ్మారి వ్యాప్తితో విద్యకు దూరమైన 3-14 ఏళ్ల వయసున్న 20,000 మంది బాలల విద్యాబుద్ధులకు, వారి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు మరియు మహమ్మారి విస్తరణ శాతాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కొవిడ్-19 కేర్ కిట్లను అందించేందుకు వినియోగించనున్నారు.
దీని గురించి లెగో గ్రూప్ ఇండియా జనరల్ మేనేజర్ స్టీన్ లాజ్ కోకెన్బోర్గ్ మాట్లాడుతూ, నిమహమ్మారి తాజా విస్తరణ దేశంలోని అత్యంత బలహీనమైన బాలల సంరక్షణ మరియు పాఠశాల విద్యపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ మద్ధతుతో బాలలు మరియు వారి కుటుంబాలకు కొంత భద్రతను కల్పిస్తుందని, విద్యా సంస్థలు మూతపడినా, పిల్లలు ఆటల ద్వారా నేర్చుకోవడం మరియు వారు కీలక నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు అవకాశం కలుగుతుందని సహకారం పిల్లలు మరియు కుటుంబాలకు కొంత భద్రతను కల్పిస్తుందని, పాఠశాలలు మూసివేయబడినప్పటికీ పిల్లలు ఆట ద్వారా నేర్చుకోవడం మరియు కీలక నైపుణ్యాలను పెంపొందించడానికి వీలు కల్పిస్తుందని నమ్మకం తమకుందని్ణ్ణ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలోనిసేవ్ ది చిల్డ్రన్ సీఈఓ సుదర్శన్ సుచి మాట్లాడుతూ, నిభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1 మిలియన్ ప్రజలను చేరుకునేందుకు మరియు రక్షణ కల్పించేందుకు సేవ్ ది చిల్డ్రన్ ఇప్పటికే తన ప్రయాణాన్ని ప్రారంభించింది మరియు లెగో గ్రూపులోని మా స్నేహితులు మా ఆశయాలను గుర్తించి, సకాలంలో మాకు 1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా అందించినందుకు ధన్యవాదాలు. ఈ మద్ధతుతో, మేము కొవిడ్-19 కేర్ కిట్లను పంపిణీ చేయడం, ఆహారం మరియు పోషకాహార మద్ధతు, వైద్య సలహా శిబిరాల నిర్వహణ ద్వారా బాలల మనుగడపై దృష్టి సారిస్తాము. దీనితో పాటు, మేము మా ఉపశమన చర్యలను నిర్వహించడంలో మరో అడుగు ముందుకు వేస్తాము మరియు సంక్షోభ సమయంలో బాలలు తమ అభ్యాస ప్రక్రియను కొనసాగించేలా మేము దృష్టి సారిస్తాము- ఇదే ఈ భాగస్వామ్యంతో మేము అందిస్తున్న అద్భుతమైన అంశం. అభ్యాస ప్రక్రియ కొనసాగింపుపై దృష్టి పెట్టడంతో శారీరక, మానసిక మరియు కాగ్నెటివ్ భద్రతకు మేము హామీ ఇస్తూ, మన బాలల ఎదుగుదల మరియు అభివృద్ధి చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తుందని్ణ్ణ పేర్కొన్నారు.
ఈ తాజా విరాళం 2020 మేలో లెగో గ్రూప్ చేసిన మొదటి సహకారంపై ఆధారపడి ఉండగా, ఇది నీతి ఆయోగ్ మరియు సేవ్ ది చిల్డ్రన్తో భాగస్వామ్యంతో గృహ-ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రవేశపెట్టేందుకు, తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు ప్రతిస్పందనగా సముదాయం చేసే ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది. సేవ్ ది చిల్డ్రన్ ఇండియాకు మద్ధతు ఇవ్వడంతో పాటు, లెగో గ్రూపు ముంబయి కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వ సహాయక చర్యలకు కూడా లెగో గ్రూపు మద్ధతుగా నిలుస్తోంది.