Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ట్యువల్గా జరిగే నెవర్ ఎలోన్ సదస్సుకు కో–స్పాన్సర్ గా హిందుజా గ్రూప్
హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి సమయంలో మానసిక ఆరోగ్య ఆవశ్యకతను తెలిపేందుకు చోప్రా ఫౌండేషన్, హిందుజా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెవర్ ఎలోన్ వర్ట్యువల్ సదస్సు నిర్వహించనున్నారు. హిందుజా గ్రూప్ కో ఛైర్మన్ గోపిచంద్ మాట్లాడుతూ ‘‘మానసిక ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా ఉంటాయి. నా దృష్టిలో బాధిత వ్యక్తికి పలు రీతులలో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ సదస్సు ఆ తరహా అవకాశాలను వెల్లడిస్తుంది’’ అని అన్నారు.చోప్రా ఫౌండేషన్ ఫౌండర్, ఎండీ శ్రీ దీపక్ చోప్రా మాట్లాడుతూ ‘‘మానసిక అనారోగ్యం కారణంగా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మనం సమిష్టిగా సహాయం చేయకపోతే, మనం మానవత్వ పరంగా అపూర్వమైన సంక్షోభంలోకి వెళ్లనున్నాం’’ అని అన్నారు. ఈ సదస్సు ఫేస్బుక్, యూట్యూబ్ తదితర మాధ్యమాలో మే21 సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.ఈ సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం కోసం తోడ్పడే ఉచిత ఆన్లైన్ ఉపకరణాలను https://neveralonesummit.live/ ద్వారా వినియోగించుకోవచ్చు.