Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యుఎస్డీ 2.4 బిలియన్ సీకె బిర్లా గ్రూప్లో భాగం కావడంతో పాటుగా ఆసియాలో అగ్రశ్రేణి బిల్డింగ్ మెటీరియల్ కంపెనీలలో ఒకటైన హెచ్ఐఎల్ లిమిటెడ్ నేడు మార్చి 31,2021తో ముగిసిన ఆర్థిక సంవత్సర ఫలితాలను వెల్లడించింది. టాప్లైన్ మరియు బాటమ్ లైన్ పరంగా పూర్తి ఆర్ధిక సంవత్సరంతో పాటుగా నాల్గవ త్రైమాసంలో ఈ కంపెనీ నమోదు చేసిన అత్యున్నత ఫలితాలు ఇవి. 2020–21 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసంలో స్థూల లాభం 62.6 కోట్ల రూపాయలను కంపెనీ నమోదు చేసింది.2019–20 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసంతో పోలిస్తే ఇది 163% వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ మొత్తంమ్మీ ద ఆదాయం పరంగా 31% వృద్ధిని నమోదు చేస్తూ 2020–21 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసంలో 844 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంలో ఇది 645 కోట్ల రూపాయలుగా ఉంది.
2020 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసంతో 2021 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసం పోల్చినప్పుడు నిరంతర కార్యకలాపాల నుంచి వ్యాపార పనితీరు పరంగా ముఖ్యాంశాలు :
· దేశీయ మరియు విదేశీ మార్కెట్లలో కోవిడ్–19 ద్వితీయ వేవ్ కారణంగా అవరోధాలు ఎదురైనప్పటికీ కన్సాలిడేటెడ్ ఎబిట్డా 114.8 కోట్ల రూపాయలుగా నిలిచింది.
· 2020 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసంతో 2021 ఆర్థిక సంవత్సర నాల్గవ త్రైమాసంతో పోల్చినప్పుడు పన్నులకు ముందు లాభం (పీబీటీ) అత్యధికంగా 81.0 కోట్ల రూపాయలుగా నిలిచింది.
· మొత్తంమ్మీద పన్నుల తరువాత లాభం (పీఏటీ) సానుకూలంగా ఉండటంతో పాటుగా 174% వృద్ధితో 62.6 కోట్ల రూపాయలుగా నిలిచింది.
2020–2021 ఆర్థిక సంవత్సరంలో నిరంతర కార్యకలాపాల ద్వారా వ్యాపార పనితీరు పరంగా ముఖ్యాంశాలు
· గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంమ్మీద 2,555 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ఈ ఆదాయం 3,044 కోట్ల రూపాయలుగా నిలిచింది.
· గత ఆర్థిక సంవత్సరం మొత్తంమ్మీద కన్సాలిడేటెడ్ ఎబిట్డా 261.9 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం అది 427.3 కోట్ల రూపాయలుగా నిలిచింది.
· 2020–21 ఆర్ధిక సంవత్సరంలో మొత్తంమ్మీద పన్నులకు ముందు లాభం (పీబీటీ) 291.6 కోట్ల రూపాయలుగా నిలువగా గత ఆర్థిక సంవత్సరంలో అది 126.9 కోట్ల రూపాయలుగా ఉంది.
· పన్నుల తరువాత లాభం (పీఏటీ) సానుకూలంగా ఉండటంతో పాటుగా 116% వృద్ధితో 214.2 కోట్ల రూపాయలుగా నిలిచింది.
· మొత్తంమ్మీద పన్నుల తరువాత లాభం (పీఏటీ) అంటే రద్దు చేసుకున్న కార్యకలాపాల అమ్మకాలపై వచ్చిన లాభాలను సైతం జోడిస్తే ఈ మొత్తం 259.7 కోట్ల రూపాయలుగా నిలిచింది.
హెచ్ఐఎల్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈవో శ్రీ ధిరుప్ రాయ్ చౌదరి మాట్లాడుతూ ‘‘గత నాలుగు సంవత్సరాలుగా తాము తమ లక్ష్యం, కార్యకలాపాలు, మౌలిక విలువలను పునర్నిర్వచించడంతో పాటుగా ఒన్స్టాప్ బిల్డింగ్ మెటీరియల్ సొల్యూషన్స్ దిశగా హెచ్ఐఎల్ను అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దాము. తాము టాప్లైన్లో మూడు రెట్ల వృద్ధిని, నిర్వహణ లాభం పరంగా నాలుగు రెట్లను గత ఐదేళ్ల కాలంలో నమోదు చేశాం. మా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఫలితాలు మా ఉద్యోగుల నైపుణ్యం, మా విస్తృతశ్రేణి వ్యాపార నమూనాను ప్రదర్శిస్తాయి. మహమ్మారి కారణంగా అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ తాము ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమ్మీద 19%టాప్లైన్ వృద్ధిని సాధించగలిగాము. కోవిడ్–19 వాతావరణంలో సైతం తమ వ్యాపార సామర్థ్యం, పనితీరును మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేయనున్నాం. అసాధారణ పరిస్థితులలో సైతం తమ బృందం చేసిన అసాధారణమైన కృషి, మా ఛానెల్ భాగస్వాముల నిరంతర మద్దతు కారణంగానే చక్కటి ఫలితాలను అందించగలిగాము. వారికి మా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. మౌలిక వసతుల ప్రాజెక్ట్లు వేగం పుంజుకోవడం కారణంగా, రూఫింగ్ సొల్యూషన్స్, బిల్డింగ్ సొల్యూషన్స్, పాలిమర్ విభాగాలతో సహా మా ఉత్పత్తి పోర్ట్ఫోలియో వ్యాప్తంగా మరిన్ని ఆర్డర్లును చూడగలమనే విశ్వాసంతో ఉన్నాము. వ్యాపారాభివృద్ధికి నూతన మార్గాలు – ఈ బిజినెస్ మరియు డీఐవై స్టోర్లపై దృష్టి సారించడంతో పాటుగా తమ యూరోపియన్ సహచరుల నుంచి అపూర్వమైన ఆదరణ, నిబద్ధత వంటివి ఫ్లోరింగ్ వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపేందుకు కీలకాంశాలుగా నిలిచాయి. ఓ కంపెనీగా, తయారీ నుంచి పంపిణీ వరకూ డిజిటల్ యంత్రాంగాలను అమలు చేస్తున్నాం. ఈ తరహా చర్యలు శక్తివంతమైన పనితీరుకు సహాయపడుతున్నాయి’’ అని అన్నారు.