Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై/న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు మరియు క్రిప్టో ఎస్సెట్స్ కోసం తగిన నియంత్రణ కార్యాచరణను రూపొందించడంతో పాటుగా విభిన్న మార్గాలను అనుసరించడం ద్వారా పరిష్కారాన్ని కనుగొనడం ఇప్పుడు దేశాలకు పెను సవాల్గా పరిణమించింది. క్రిప్టో కరెన్సీ ప్లేయర్లకు ప్రాతినిధ్యం వహించే ఐఏఎంఏఐ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మరియు దాని బ్లాక్చైన్ అండ్ క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ) సభ్యులు ఓ వెబినార్ను ‘అభివృద్ధి చెందుతున్న క్రిప్టో నియంత్రణ ముసాయిదా – భారతదేశం మరియు సింగపూర్లలో అభివృద్ధి’ నేపథ్యంతో నిర్వహించారు. భారతదేశంతో పాటుగా సింగపూర్కు చెందిన నిష్ణాతులు ఈ అంశంపై మాట్లాడారు.
వజీర్ ఎక్స్ సీఈవో శ్రీ నిశ్చల్ శెట్టి మాట్లాడుతూ ‘‘ దాదాపు 1.5 కోట్ల మంది భారతీయులు 1500 కోట్ల విలువైన క్రిప్టో ఆస్తులను కలిగి ఉన్నారు. వజీర్ఎక్స్ పై 1.1 మిలియన్ల మంది వినియోగదారులు 5.4 బిలియన్ యుఎస్డీని ఏప్రిల్ 2021లోనే నమోదు చేశారు. భారతదేశం, ఇక ఎంత మాత్రమూ చిన్న మార్కెట్ కాదు,అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక మార్కెట్ ఇది. క్రిప్టో స్వీకరణ ఇక్కడ పెరుగుతున్నప్పటకీ, క్రిప్టో స్టార్టప్స్ పరంగా మాత్రమే కాదు నియంత్రణల పరంగానూ వెనుకబడింది. మనం ఖచ్చితంగా క్రిప్టో కోసం మన వ్యాపారవేత్తలను అభివృద్ధి చేయాల్సి ఉంది’’ అని అన్నారు. శ్రీ జైదీప్ రెడ్డి, లీడర్, క్రిప్టో–ఎస్సెట్స్ అండ్ బ్లాక్చైన్,నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ మాట్లాడుతూ ‘‘అతి తక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నచోట సాధారణంగా కోర్టులు పూర్తి నిషేదాషలను సమర్ధించలేదు. బహుళ అధికార పరిధి యొక్క విధానం, సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమని సూచిస్తుంది’’ అని అన్నారు. భారతదేశంలో క్రిప్టో మార్కెట్ నియంత్రణ ఆవశ్యకతను శ్రీ వివేక్ కత్పాలియా, హెడ్, సింగపూర్ ఆఫీస్ అండ్ లీడర్, టెక్నాలజీ లా, నిశిత్ దేశాయ్ అసోసియేట్స్ వెల్లడిస్తూ భారతదేశంతో పాటుగా సింగపూర్లు ఫిన్టెక్ హబ్స్గా అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశంలో త్వరలోనే నియంత్రణలు ఆరంభమవుతాయని ఆశిస్తున్నాం అని అన్నారు.
రెగ్యులేటర్లు మరియు పరిశ్రమ నడుమ సహకార ప్రయత్నాలు ఉండాల్సిన ఆవశ్యకతను శ్రీ శ్రీరామ్ చక్రవర్తి, కౌన్సిల్, రాజా అండ్ తన్ సింగపూర్ ఎల్ఎల్పీ వెల్లడిస్తూ ‘‘ప్రభావవంతమైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సృష్టించడానికి ప్రభుత్వాలు తప్పనిసరిగా క్రిప్టో పరిశ్రమ, ప్రాతినిధ్య సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా అంతర్జాతీయ విధానాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంతో పాటుగా పరిశ్రమ నడుమ సమాచార మార్పిడి తగిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్కు అత్యంత కీలకం’’ అని అన్నారు.