Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రభుత్వ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) పథకం, పిఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారులకు నగదును అందించడం ద్వారా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో భారతదేశ వ్యవసాయ సమాజానికి సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క మర్చంట్ పాయింట్లు సిద్ధంగా ఉన్నాయి. రూ. 9000 కోట్లు నేరుగా 9.5 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాల ఖాతాల్లోకి చేరాయని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రకటించారు. ప్రతి రైతు లబ్ధిదారుడు తన బ్యాంకు ఖాతాలో రూ. 2,000 పొందుతాడు. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ, డిబిటి పథకం లబ్ధిదారులు నగదు తీసుకోవడానికి లేదా మరే ఇతర బ్యాంకింగ్ లావాదేవీలు చేయడానికి సమీప ఫినో పాయింట్ను సందర్శించవచ్చు. కిరాణా, మెడికల్ స్టోర్స్, డెయిరీ షాపులు మరియు మైక్రో ఎటిఎం మరియు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) పరికరాలతో కూడిన భారత్ పెట్రోలియం (BPCL) అవుట్లెట్లు వంటి చెంతనే ఉన్న చిన్న వ్యాపారులే ఫినో పాయింట్లు. సమీప ఫినో పాయింట్ను కనుగొనడానికి, ప్రజలు https://fino.latlong.in/ URL పై క్లిక్ చేయవచ్చు లేదా QR కోడ్ను స్కాన్ చేయవచ్చు.
“అవసరం ఉన్న ఏ సమయంలోనూనా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలు”అని ఫినో పేమెంట్స్ బ్యాంక్ సిఎస్ఓ శైలేష్ పాండే చెప్పారు. “ఫినో యొక్క హమేషా అందుబాటులో ఉండే అవుట్లెట్, బయటకు కదిలేందుకు వీలు లేని ఈ క్లిష్ట సమయంలో, ప్రజలకు సౌకర్యాన్ని అందించేందుకు ఎక్కువ గంటలు తెరిచి ఉంటుంది. లబ్ధిదారులు ఎప్పుడైనా పాయింట్లలోకి వెళ్లవచ్చు లేదా నగదు తీసుకోవడానికి లేదా వారి కుటుంబానికి డబ్బు పంపించడానికి డోర్ స్టెప్ సేవలను పొందవచ్చు. మరీ ముఖ్యంగా బిపిసిఎల్ అవుట్లెట్లతో సహా మా పాయింట్ల వద్ద నగదు ఎల్లప్పుడూ లభిస్తుంది. అవసరమయ్యే ఈ సమయంలో వ్యవసాయ సమాజానికి అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయం కల్పించడమే మా లక్ష్యం.”
పిఎం కిసాన్ యోజన ఆర్థిక ప్రయోజనం అర్హతగల రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6000, మూడు సమానమైన వాయిదాలలో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు. 21-22 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత చెల్లింపు 14 మే. 2020లో లాక్డౌన్ సమయంలో, ఫినో మర్చంట్ నెట్వర్క్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థానిక మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ను సులభతరం చేసింది. స్థానికంగా తెలిసిన ప్రజలు ఫినో మర్చంట్ని రోజులో ఏ సమయంలోనైనా నగదు అవసరం కోసం సంప్రదించేవారు. ఈ సేవ, సీనియర్ సిటిజన్లు, మహిళలు మరియు పెన్షనర్లకు గొప్ప సౌకర్యాన్ని అందించింది. విత్ డ్రా చేసుకున్న వారిలో ఎక్కువ భాగం సామాజిక భద్రత పెన్షన్, పిఎమ్జెడివై, పిఎం కిసాన్ యోజన వంటి పథకాల డిబిటి లబ్ధిదారులే. ఫినో పాయింట్ల వద్ద, ప్రజలు కొత్త ఖాతాను తెరవవచ్చు మరియు నగదు డిపాజిట్, డబ్బు బదిలీ, యుటిలిటీ బిల్లు మరియు రుణ EMI చెల్లింపు సేవలను కూడా పొందవచ్చు మరియు ఆరోగ్యం, జీవిత మరియు మోటారు భీమాను కొనుగోలు చేయవచ్చు. అన్నీ చెంతనే, ఇంకా పూర్తిగా కాగితం లేని విధానం - హమేషా!