Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ లలోని ఆసుపత్రులకు 20 అడ్వాన్స్ డ్ జర్మన్ వెంటిలేటర్ల విరాళం
• 10 యూనిట్ల ఆక్సీజన్ కాన్ సెన్ ట్రేటర్లతో ఉజ్జయిని జిల్లా ఆసుపత్రికి సాయం
• కోవిడ్ -19 సహాయ వస్తువులకు మద్దతుగా నగ్డా లోని ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆసుపత్రికి రూ.10 లక్షల విరాళం
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో తన వంతుగా తన సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా లానెక్సెస్ ఇండియా వైద్యపరమైన మౌలిక వసతులకు గాను రూ.2.1 కోట్ల మేరకు సాయం చేసింది. సెకండ్ వేవ్ లో కోవిడ్ -19 కేసులు బాగా పెరిగిపోయాయి. దీంతో రోగులకు చికిత్స చేసేందుకు ఉపయోగించే ముఖ్యమైన వైద్య ఉపకరణాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆసుపత్రులు ఈ సమయంలో మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు వీలుగా లానెక్సెస్ ఇండియా రూ. 1.9 కోట్ల విలువైన అధునాతన జర్మన్ వెంటిలేటర్లు 20 యూనిట్లను థానె, ముంబై (మహారాష్ట్ర), ఉజ్జియిని (మధ్యప్రదేశ్), అంక్లేశ్వర్, బారుచ్ (గుజరాత్)లలోని ఆసుపత్రులకు విరాళంగా అందించింది.
తన సైట్లు, కార్యాలయాలు గల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని తొమ్మిది ఆసుపత్రులకు ఈ వెంటిలేటర్లను కంపెనీ విరాళంగా అందించింది. థానేలోని కౌశల్య మెడికల్ ఫౌండేషన్ ట్రస్ట్ హాస్పిటల్ మరియు బెథానీ హాస్పిటల్, ముంబైలోని శుశ్రుషా హాస్పిటల్, అంక్లేశ్వర్ లోని జయబెన్ మోడీ హాస్పిటల్, సేవాశ్రమ్ హాస్పిటల్ మరియు భరూచ్ లోని సివిల్ హాస్పిటల్, పాటి దార్ హాస్పిటల్, జె కె హాస్పిటల్ మరియు ఉజ్జయినిలోని ఎస్ఎస్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ ఉన్నాయి. కోవిడ్- 19 రోగుల చికిత్స కోసం ఆసుపత్రులు ఈ వెంటిలేటర్లను ఉపయోగిస్తాయి.
అదనంగా, దేశంలో పెరుగుతున్న వైద్య ఆక్సిజన్ అవసరాన్ని ఎదుర్కోవటానికి, లానెక్సెస్ ఇండియా పది యూనిట్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో ఉజ్జయిని జిల్లా ఆసుపత్రికి మద్దతు ఇచ్చింది.
నాగ్డాలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్ (ఇఎస్ఐసి) కు రూ.10 లక్షలతో కంపెనీ ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంలో, రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించడంలో సహాయ పడింది.
లానెక్సెస్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నీలాంజన్ బెనర్జీ ఈ సందర్భం గా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ప్రస్తుత కరోనావైరస్ మహమ్మారి రెండవ తరంగం మన దేశ వైద్య మౌలిక సదుపాయాలను భారంతో ముంచెత్తింది, క్లిష్టమైన వైద్య పరికరాల కొరతకు దారితీసింది. మా కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రయత్నాల్లో భాగంగా, థానేలోని మా ప్రధాన కార్యాలయం మరియు నాగ్డా, జగాడియా లలోని మా కర్మాగారాల చుట్టూ ఉన్న కొన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభి వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మేం మరోసారి ప్రయత్నించాం. కోవిడ్ -19 వినాశకర మైన సెకండ్ వేవ్ తో పోరాడటానికి మేం సమాజానికి సహాయం చేస్తూనే ఉంటాం” అని అన్నారు.
కోవిడ్ -19 ఉపశమనం కోసం సిఎస్ఆర్ వ్యయంలో భాగంగా 2020-21లో లానె క్సెస్ ఇండియా రూ.3.6 కోట్లకు పైగా విరాళం ఇచ్చింది. ఇందులో పీఎం కేర్స్ ఫండ్ కు రూ.2 కోట్లు, థానేలోని ఆసుపత్రులకు 6 యూనిట్ల అధునాతన జర్మన్ వెంటిలే టర్లు ఉన్నాయి. ఇతర ఉపశమన వస్తువులలో1 టన్ను ఉపరితల క్రిమి సంహారక మందు, రిలీ + ఆన్™ విర్కాన్™, ఫేస్ మాస్క్ లు ఉన్నాయి.