Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యునిసెఫ్తో పాటు పలు స్థానిక కార్యక్రమాల నిర్వహణకు ఈ విరాళాలు మద్ధతు ఇవ్వనుంది
హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం వృద్ధి చెందుతున్న కొవిడ్-19ను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలను మద్ధతు ఇచ్చేందుకు కింబర్లి-క్లార్క్ కార్పొరేషన్ 2.5 మిలియన్ డాలర్ల (రూ.18 కోట్లు) విరాళాన్ని అందించింది. ఈ అత్యవసర సహాయ నిధిని తన భాగస్వామి యునిసెఫ్ ద్వారా అందిస్తుండగా, దాన్ని ప్రాణాలను కాపాడే మరియు ఆరోగ్య సేవల అవసరాలైన, ముఖ్యంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఆక్సిజన్ యూనిట్లను నెలకొల్పడం తదితర అవసరాలకు తక్షణమే వినియోగించనున్నారు. కొవిడ్-19 పరిష్కరణలకు సహాయపడేలా ఇతర స్థానిక కార్యక్రమాలకు కూడా కంపెనీ మద్ధతు ఇవ్వనుంది. అంతే కాకుండా, కంపెనీ తాను సేవలు అందిస్తున్న పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అన్ని రకాల ఇతర సహాయాలను కొనసాగించనుంది.
కింబర్లి-క్లార్క్ అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ డొనేషన్ డ్రైవ్ ప్రారంభించగా, ప్రపంచం వ్యాప్తంగా తన ఉద్యోగులు భారతదేశంలో ప్రస్తుత మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు అలాగే ఈ పరిస్థితులను అదుపు చేసేందుకు విరాళాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. ది కింబర్లి-క్లార్క్ ఫౌండేషన్ భారతదేశానికి మద్ధతుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధిని అందిస్తానని ప్రతిజ్ఞ చేసింది.
ఈ ప్రకటన గురించి కింబర్లి-క్లార్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైనాక్ ధర్ మాట్లాడుతూ ‘‘మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలు దీర్ఘకాలికమైన, క్రియాశీలకమైనవిగా మరియు సకాలికమైనవిగా ఉన్నాయి. భారతదేశంలో రెండో అల అసాధారణంగా ఉంది మరియు అత్యంత ప్రాణాంతకంగా పరిణమించింది మరియు మనం దానిపై గెలిచేందుకు ఏకైక దారి ఏమిటంటే మన అన్ని ప్రయత్నాలను ఒక్కటిగా చేసి పోరాడమే. సాధ్యమైనంత మేర ఎక్కువ ప్రాణాలను కాపాడడం అన్నింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతగా ఉందని’’ పేర్కొన్నారు.
భారతదేశంలో యునిసెఫ్కు ప్రతినిధి డా.యాస్మిన్ అలి హక్ మాట్లాడుతూ ‘‘ఈ మహమ్మారి ఊహించని రీతిలో ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. మనలో ఎవరూ ఒంటరిగా దీన్ని ఎదిరించడం సాధ్యం కాదు. భారతదేశంలోని ప్రజలకు ప్రాణాలను కాపాడు అటువంటి మద్ధతు ఇచ్చేందుకు ఇటువంటి ఎక్కువ విరాళాల అవసరం ఉంది. కింబర్లి-క్లార్క్కు అత్యంత అవసరమైన చోట అత్యంత ప్రముఖ పరిష్కరణలను అందించడంలో యునిసెఫ్తో కలిసి పని చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాము. ఇది ఎక్కువ ప్రైవేటు వలయానికి చెందిన సంస్థలు ముందుకు వచ్చేందుకు అలాగే అత్యంత అవసరమైన బాలలకు వారి తరుపున సహకారాన్ని అందించేందుకు ఉత్తేజిస్తుందన్న భరసా తమకుందని’’ తెలిపారు.
ఈ నిధిని గత 15 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 ప్రతిక్రియ మరియు పరిష్కరణ ప్రయత్నాలతో కింబర్లి-క్లార్క్ మరియు ది కింబర్లి-క్లార్క్ ఫౌండేషన్లు, యునిసెఫ్, ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ సొసైటీస్ మరియు అమెరికన్ రెడ్ క్రాస్ అలాగే ది బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్స్ ఆఫ్ అమెరికాల భాగస్వామ్యంలో మద్ధతు ఇచ్చేందుకు గ్లోబల్ నిబద్ధతను విస్తరించింది.