Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· ఉత్తర్ ప్రదేశ్ కు డెలివరీ చేయబడిన ఎల్ డీఎస్ సిరంజెస్ - లక్నో మరియు నోయిటాల్లో జిల్లా పరిపాలనా విభాగాలకు 325,000 చొప్పున
· తమిళనాడులో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కు 350,000 ఎల్ డీఎస్ సిరంజీలు త్వరలోనే అప్పగించబడతాయి
ఢిల్లీ: భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్ ఉద్యమంలో మద్దతు చేయడానికి శామ్ సంగ్ ఒక మిలియన్ ఇన్నోవేటివ్ లో డెడ్ స్పేస్ (ఎల్ డీఎస్) సిరంజుల్ని దిగుమతి చేస్తోంది. ఇది దేశం కంసో కంపెనీ వారి కోవిడ్ మద్దతు కార్యక్రమంలో ఒక భాగం. ఎల్డీఎస్ సిరంజెస్ ఇంజెక్షన్ చేసిన తరువాత సిరంజెస్ లో చాలా తక్కువ పరిమాణంలో డ్రగ్ ని మిగులుస్తాయి, ఇది వ్యాక్సిన్ వ్యర్థమవడాన్ని తగ్గిస్తుంది,తద్వారా అదే వ్యాక్సిన్ పరిమాణంతో 20%ఎక్కువమంది ప్రజలు మోతాదు తీసుకోగలరు.
దక్షిణ కొరియా నుండి విమానంలో దిగుమతి చేయబడిన ఎల్ డీఎస్ సిరంజెస్, ఉత్తర్ ప్రదేశ్ కు డెలివరీ చేయబడ్డాయి, లక్నో, నోయిడాల్లో జిల్లా పరిపాలనా విభాగాలకు 325,000 చొప్పున అందచేయబడ్డాయి-కాగా తమిళనాడులో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కి త్వరలోనే 350,000 ఎల్ డీఎస్ సిరంజెస్ అందచేయబడతాయి. ఈ సిరంజెస్ జిల్లాల్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేయబడతాయి. ఎల్డీఎస్ సిరంజెస్ వెనక ఉన్న టెక్నాలజీ 20%వరకు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అనగా ప్రస్తుతమున్న సిరంజెస్ ఒక మిలియన్ మోతాదుల్ని అందచేయగలిగితే, ఎల్ డీఎస్ సిరంజెస్ 1.2 మిలియన్ మోతాదుల్ని అదే వ్యాక్సిన్ మొత్తంతో అందచేయగలవు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా శామ్ సంగ్ ఈ సిరంజెస్ తయారీదారుకి సహాయపడింది.
ఈ కొత్త సిరంజ్ వ్యాక్సినేషన్ ని అనుకూలికరించడానికి యునైటెడ్ స్టేట్స్ తో సహా కొన్ని మార్కెట్లలో వాడకానికి ప్రవేశపెట్టబడింది. “ఈ క్లిష్ట పరిస్థితుల్లో శామ్ సంగ్ దేశానికి మద్దతుగా నిలిచింది. గత కొద్ది వారాలుగా, ఇప్పుడు అత్యంత అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ మరియు ఆక్సిజన్ సిలిండర్స్ మరియు ఈ సామగ్రిని కొనుగోలు చేయడానికి ఆర్థిక నిధులతో శామ్ సంగ్ ప్రభుత్వాలకు మద్దతు చేయడం పై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు, మన దేశం ప్రజలకు వ్యాక్సినేషన్ చేయడం పై దృష్టి కేంద్రీకరించడం వలన, వ్యాక్సిన్ వృధా అవడాన్ని తగ్చిం అదే వ్యాక్సిన్ పరిమాణంతో మరింతమంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేయడానికి మేము ఈ ప్రయత్నాన్ని కొత్త ఎల్ డీఎస్ సిరంజ్ లతో మద్దతు చేస్తున్నాం.”అనిశ్రీ పార్థ ఘోష్, శామ్ సంగ్ ఇండియా సీఎస్ఆర్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన అధికారి అన్నారు. భారతదేశం కోవిడ్-19తో చేసే పోరాటంతో తన మద్దతుగా శామ్ సంగ్ 5 మిలియన్ (రూ. 37 కోట్లు) యుఎస్ డాలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా అందచేస్తానని వాగ్ధానం చేసింది మరియు తమ పౌరసత్వం చొరవల్లో భాగంగా ఆసుపత్రులకు ప్రధానమైన వైద్య సామగ్రితో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. శామ్ సంగ్ వారి తోడ్పాటులో 2 మిలియన్ యుఎస్ డాలర్ల విలువ గల వైద్య సరఫరాలలో 100 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్, 3,000 ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఒక మిలియన్ ఎల్ డీఎస్ సిరింజీలు భాగంగా ఉన్నాయి.
శామ్ సంగ్ స్థానిక సంస్థలు మరియు ఇతర భాగస్వాముల అవసరాల్ని అర్థం చేసుకోవడానికి వాటితో నిరంతరంగా సంప్రదిస్తోంది మరియు ఈ క్లిష్టమైన సమయాల్లో స్థానిక సమాజాలకు సహాయపడే వైద్య సరఫరాల్ని అందించడానికి మేము కట్టుబడ్డాము. ఈ పోరాటంలో ముందుండి నిరంతరంగా శ్రమిస్తున్న నిపుణులు అందరికీ శామ్ సంగ్ అభివాదం చేస్తోంది. భారతదేశం వ్యాప్తంగా మా ఉద్యోగులు మరియు మా భాగస్వాములు మరియు వారి ఉద్యోగులు సహా శామ్ సంగ్ కుటుంబం కోవిడ్-19తో చేసే ఈ పోరాటంలో కలిసికట్టుగా నిలుస్తుంది.