Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొవిడ్-19 రెండో అల విరుచుకు పడుతున్న ఈ సమయంలో, దేశంలో ఔత్సాహికులైన పబ్లిక్ పాలసీ ప్రతిభకు మద్దతు ఇచ్చే దిశలో, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ జులై 2021లో ప్రారంభమవుతున్న తన మొదటి బ్యాచ్ ద్వారా సమకూరే తన సమిష్టి ఆదాయంలో 30 శాతాన్ని విద్యార్థుల స్కాలర్షిప్లకు కేటాయించింది. రేపటి ఉత్తమ విధాన నాయకులను తీర్చి దిద్దే ప్రయత్నంలో, కౌటిల్య నీడ్ –బేస్డ్ స్కాలర్షిప్ల రూపంలో పబ్లిక్ పాలసీ విద్యను విద్యార్థులు అభ్యసించేందుకు వేదికను రూపొందించారు. కొత్తగా వస్తున్న విద్యార్థుల్లో 50% మంది పబ్లిక్ పాలసీలో తమ పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం మొత్తం ట్యూషన్ ఫీజులో 25 శాతం, 50 శాతం మరియు 100 శాతం మాఫీని ఏక మొత్తంలో స్కాలర్షిప్లుగా అందుకుంటారు. ఈ విభాగంలో స్కాలర్షిప్లను పొందిన విద్యార్థులలో, ప్రీతిష్ ఆనంద్ తన ఫీజు రుసుము నుంచి 50 శాతాన్ని, మహ్మద్ హబీబుల్లా, వసీమ్ అహ్మద్ మరియు తాజాగా కోల్కతా విద్యార్థి రత్నదీప్ చక్రవర్తి 100 శాతం మాఫీని పొందారు. వీరి ఎంపికలు, ఫీజు మాఫీ అనేవి వారి దరఖాస్తులు, ఇంటర్వ్యూలు మరియు వారి వ్యాస సమర్పణల ఆధారంగా జరిగాయి. ‘‘దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆచరణాత్మక విధానంలో తమ విద్యా విధాన పునాదులు అన్వేషించుకుని మరియు బలోపేతం చేసుకుంటూ అభ్యసించేందుకు అనువుగా కౌటిల్య విలువలను దృఢంగా అనుసరిస్తోంది. దేశం గర్వించ దగిన విద్యార్థులు అభ్యసించేందుకు మరియు ఉత్తమ పౌరులుగా మారడానికి ఆర్థిక వనరులు అడ్డంకిగా ఉండకూడదని మేము విశ్వసిస్తున్నాము. మా నీడ్-బేస్డ్ స్కాలర్షిప్లు విద్యార్ధుల అభిరుచులను కేంద్రీకరించి, ఒక మార్పును సృష్టించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అకడెమిక్ రికార్డ్కు అనుగుణంగా పబ్లిక్ పాలసీలో పోస్ట్-గ్రాడ్యుయేట్ అర్హతను అధ్యయనం చేసి, పొందేందుకు అవకాశం కల్పిస్తుందని’’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వసీం అహ్మద్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అర్హత సాధించిన అండర్ గ్రాడ్యుయేట్. ఎక్కువ మంది ప్రజలను వినూత్న ఆలోచనలు మరియు సామాజిక సేవలతో అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకునే అహ్మద్, వైవిధ్యత, ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించే సమగ్ర విధానాలను రూపొందించేందుకు పబ్లిక్ పాలసీని తన తదుపరి అడుగుగా ఎంచుకున్నారు. ఈ కష్ట సమయాల్లో వలస కార్మికులకు ఆహారాన్ని అందించడం నుంచి మరో అడుగు ముందుకు వేసి, పేదలు ఎక్కువగా సమస్యల్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలపై నిర్వహించిన భౌగోళిక పరిశోధనలను పరిశీలిస్తూ, దృఢమైన విధాన రూపకల్పనకు శ్రమించడమే దేశ సవాళ్లకు దీర్ఘకాలిక సమాధానం అని ఆయన అభివర్ణించారు. వసీమ్ అహ్మద్ మాట్లాడుతూ, “సామాజిక అభివృద్ధి ప్రాముఖ్యతను మహమ్మారి ఒకటి కన్నా ఎక్కువ మార్గాల్లో నాకు నేర్పింది. ప్రజల వలసలు, పేదల నిరంతర పోరాటం మరియు భోజనం మరియు నిత్యావసరాల రూపంలో తాత్కాలిక ఉపశమనాలను అందించడం అనేది ఒక బిలియన్ పైచిలుకు జనాభా ఉన్న దేశంలో దీర్ఘకాలిక పరిష్కారాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. దీని ద్వారా నేను చేస్తున్న ప్రయత్నాలు దేశ నిర్మాణానికి అవసరమైన పద్ధతుల్లో ఆశాభావాన్ని పెంపొందించుకునేందుకు నాకు సహాయపడుతూ, ప్రజలకు మరియు సమయానికి అనుగుణమైన వాటిని సమగ్ర పద్ధతిలో అందించేందుకు అవకాశం కల్పిస్తాయని’’ పేర్కొన్నారు. మహమ్మద్ హబీబుల్లా, గీతం (GITAM) నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. మహమ్మారి ప్రపంచం వ్యాప్తంగా ప్రజలపై చూపించిన ప్రభావం మరియు దాని పర్యవసానాలను గమనించి, దేశానికి కావలసిన పాలసీ మార్పును తన విధాన రూపకల్పన ద్వారా కనుగొన్నారు. రేపటి దేశ విధానాలకు సంబంధించి ఒక విద్యార్థిగా మార్పులు తీసుకు రావలసిన రంగాల గురించి అకడెమిక్ క్లబ్లు, ఎన్ఎస్ఎస్, చర్చలు మరియు దేశ ప్రజలకు ప్రస్తుతం అవసరమైన వాటిపై నిరంతర పరిశోధనల ద్వారా హబీబుల్లా తన మార్గాన్ని కనుగొన్నారు. ‘‘దేశ ప్రజలు తమకు ప్రభుత్వం అందించే పాలసీల ద్వారా సంక్షేమానికి, స్థిరమైన అభ్యున్నతికి అర్హులు కాగా, దుర్భరమైన సమయాల్లో కనిపిస్తున్న లొసుగులను ప్రశ్నించే హక్కును కూడా కలిగి ఉంటారు. ఈ వాస్తవాలను పరిశీలిస్తే, పాలసీ రూపకల్పన మరియు దేశం అభివృద్ధి అంటే నాకు మక్కువ. పరిశోధన మరియు సోషల్ డెవలప్మెంట్ చేయగల చక్కని విషయాలను ఎవరు కనుగొన్నారో తెలుసుకునేందుకు అంతర్ముఖునిగా ఉన్న నేను బయటపడేలా మార్చడం, భారతదేశంలోని ప్రతి వ్యక్తికి ప్రతినిధిగా ఉండే పాలసీల రూపకల్పనలో ఈ స్కాలర్షిప్ నాకు అవసరమైన పునాదిని వేస్తుందని నేను విశ్వసిస్తున్నానని’’ మహహ్మద్ హబీబుల్లా పేర్కొన్నారు. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తన 2-ఏళ్ల, ఫుల్-టైమ్ రెసిడెన్షియల్ ఎంపిపితో, విభిన్న విభాగాలకు చెందిన విద్యార్థులను ఒకచోట చేర్చుకోవడం మరియు ముఖ్య అంశాలను ఇంటర్నలైజ్ చేసేందుకు మరియు అలవర్చుకునేందుకు సమయాన్ని కేటాయిస్తుంది. దరఖాస్తులను 31 మే 2021లోగా సంస్థకు చేరేలా పంపవలసి ఉంటుంది మరియు భారతదేశాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఆసక్తి చూపించే, మార్పును తీసుకు వచ్చేలా విద్యార్థులను ప్రోత్సహిస్తోంది.