Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో దేశానికి మద్ధతు ఇచ్చే దిశలో ఇమేజింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న కెనాన్ ఇండియా తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో టీకా జాగృతి కార్యక్రమం అలాగే మద్ధతు శిబిరాలను నిర్వహించింది- మహేశ్వరి గ్రామం (హరియాణ), పరివలి గ్రామం (ముంబయి), కల్యాణపుర గ్రామం (కోల్కతా) మరియు అన్నదొడ్డి (బెంగళూరు)ల్లో టీకా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సహకారాన్ని అందించింది. కెనాన్ ఇండియా గ్రామస్థులకు టీకా గురించి సమాచారం, దానితో కలిగే ప్రయోజనాలు, తదుపరి పరిణామాలు మరియు ప్రక్రియల గురించి తెలియజేస్తుంది. అదనంగా టీకా నమోదుకు డిజిటల్ వనరుల కొరతను పరిగణనలోకి తీసుకుని సంస్థ నేరుగా రిజిస్ట్రేషన్ అందుబాటులో లేని చోట వారికి ప్రభుత్వ పోర్టల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా చిన్న గ్రామాల్లో టీకా గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని కెనాన్ ఇండియా గ్రామీణ భారతదేశంలో జాగృతిని వృద్ధి చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది మరియు కొవిడ్-19 టీకాల గురించి ఉన్న అపోహలను తొలగించే లక్ష్యాన్ని మాత్రమే కాకుండా వారికి టీకా వేయించుకునే సమయాన్ని నిర్ణయించుకునేలా ఉత్తేజిస్తుంది.
వాలంటీర్లు ఆయా గ్రామాల్లో ఉంటున్న వారి ఇళ్లకు, గ్రామ అధికార సంస్థలు మరియు నాయకులకు సరైన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా అక్కడి ప్రజలకు టీకా ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు ఉత్తేజిస్తారు. ఈ జాగృతి కార్యక్రమంలో భాగంగానే సంస్థ 1000 ప్రజలకు టీకాతో పాటు, దాని ప్రక్రియ అలాగే వారికి పోర్టల్స్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మద్ధతు ఇచ్చింది. ఈ కార్యక్రమం గురించి కెనాన్ ఇండియా అధ్యక్షుడు మరియు సీఈఓ మనబు యమఝకి మాట్లాడుతూ ‘‘ సామాజిక బాధ్యత కలిగిన కార్పొరేట్ సంస్థగా మేము కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసికట్టుగా నిలవడం, అందులోనూ ఈ మహమ్మారి రెండో అలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం చాలా ఉంది. కెనాన్ ఇండియాలో మా సిబ్బంది సురక్షత అలాగే సౌఖ్యత మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉంది మరియు ఇందులో మా ఉద్యోగులు, వారి కుటుంబాలు అలాగే మేము దత్తత తీసుకున్న గ్రామాలకు విస్తరించిన కుటుంబాలూ ఉన్నాయి. మా కార్పొరేట్ తత్వం ‘క్యూసీ’ కెనాన్ ఇండియా సిఎస్ఆర్ ప్రయత్నాల హృదయ స్థానంలో ఉండగా, మేము దత్తత తీసుకున్న సముదాయాలను మాకు సాధ్యమైనంత మేర అన్ని రకాలుగా కొవిడ్-19పై పోరాటం చేసేందుకు సిద్ధం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. దేశంలో ప్రస్తుతతం టీకా ప్రక్రియతో మా వాలంటీర్లు ఈ గ్రామాల్లో ప్రవర్తన మార్పుకు అలాగే టీకా వేయించుకునేలా చేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ జాగృతి కార్యక్రమం చక్కని అలలా పరిణామం సృష్టిస్తోంది మరియు సముదాయాలకు ఎక్కువ విస్తరిస్తోంది అలాగే కొవిడ్-19 టీకా ప్రాముఖ్యత గురించి ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నిరీక్షిస్తున్నాము. ఒక వారం లోపల, మేము ఈ కార్యక్రమం ద్వారా 1000 మందికి పైగా ఎక్కువ మందిని ఒక్క తాటిపైకి తీసుకు రావడంలో విజయం సాధించామని’’ వివరించారు.
నిరుడు, కెనాన్ ఇండియా తన కొవిడ్-19 పరిహార ప్రయత్నాలను ప్రారంభించగా, తాను దత్తత తీసుకున్న గ్రామాల్లోని దినకూలీ కార్మికులు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న (BPL) కుటుంబాలతో కలిపి 12,500 మంది లబ్దిదారులకు కావలసిన నిత్యావసరాల కిట్లను అలాగే ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజ్లోని కుటుంబాల ఇళ్లకు శానిటైజేషన్ వస్తువులను అందజేసింది. సర్జికల్ మాస్కులు, శానిటైజర్లు, లిక్విడ్ సోప్ మరియు ఇళ్లు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల స్వచ్ఛతకు కావలసిన వస్తువులను వితరణ చేయడం ద్వారా సమాచారం మరియు జాగృతి కార్యక్రమాలను ఫరీదాబాద్ మరియు హైదరాబాద్లోని ఎస్ఓఓస్ చిల్ర్డన్ విలేజ్ బాలల కోసం నిర్వహించింది. వారు దేశంలోని వైద్య సహాయక సిబ్బందికి అలాగే తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో వద్ద ముంబయి, హరియాణ మరియు బెంగళూరుల్లోనే ప్రభుత్వ ఆసుపత్రులకు 732 పిపిఇ కిట్లను పంపిణీ చేయడం ద్వారా ఆరోగ్య కార్యకర్తల సురక్షతను ధృవీకరించింది.