Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశ వ్యాప్తంగా వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలను వృద్ధి చేసేందుకు మద్ధతు ఇచ్చేందుకు నేడు పలు చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో ఆక్సిజన్ యూనిట్లు, వైద్య పరికరాలు మరియు ఐసియు సౌకర్యాల వంటి శాశ్వత వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలను నెలకొల్పడం ఉండగా, దేశ వ్యాప్తంగా ఆసుపత్రులకు వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ఇందులో ఉంది. బ్యాంకు 2021-22లో పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా కొవిడ్-19 పరిహార కార్యక్రమాలకు రూ.100 కోట్ల ప్రారంభిక మొత్తానికి కట్టుబడి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పరివర్తన్ కార్యక్రమంలో కొవిడ్-19 పరిహారానికి రూ.120 కోట్ల విరాళాన్ని ఇచ్చింది.
భారతదేశ వ్యాప్తంగా వైద్య సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగు చేసేందుకు మద్ధతు ఇచ్చేందుకు బ్యాంకు దిగువ పేర్కొన్న చర్యలు చేపట్టింది:
- భారతదేశంలో వివిధ ఆసుపత్రుల్లో 20 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించడం
- మూడు 100 పడకల కొవిడ్ సంరక్షణ సదుపాయాల ఏర్పాటు
- రెండు ఐసోలేషన్ సెంటర్ల నిర్మాణం
- దేశ వ్యాప్తంగా 200 ఆసుపత్రులకు వైద్య పరికరాలు మరియు ఉత్పత్తుల పంపిణీ
- ఆక్సిజన్ కేంద్రాలు మరియు కొవిడ్ సంరక్షణ సదుపాయాలను ప్రారంభించేందుకు బ్యాంకు దేశ వ్యాప్తంగా ఆసుపత్రులను గుర్తించేందుకు స్థానిక పాలన సంస్థలతో కలిసి పని చేయనుంది.
అంతే కాకుండా బ్యాంకు మహమ్మారితో బాధితులైన విద్యార్థులకు జుజూూ (ఎడ్యుకేషన్ క్రైసిస్ స్కాలర్షిప్ స్కీం)లో భాగంగా స్కాలర్షిప్లను అందించాలని యోచిస్తోంది మరియు గ్రామాల్లో 1.5 లక్షల మందికి నెలకు సరిపోయే నిత్యావసరాలను అందించనుంది.
''హెచ్డిఎఫ్సి బ్యాంక్ సముదాయాలు మరియు సంస్థలు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు అందరూ కలిసి కట్టుగా ముందుకు రావడంపై విశ్వాసాన్ని ఉంచిందని'' హెచ్డిఎఫ్సి బ్యాంకు సిఎస్ఆర్, బిజినెస్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ తెలిపారు. ''మా ప్రయత్నాలు సమాజానికి మేము చేస్తున్న చిన్న సేవల్లో భాగంగా ఉన్నాయి. పరివర్తన్లో భాగంగా మేము దీర్ఘావధి సుస్థిర మౌలిక సౌకర్యాలను నెలకొల్పడంలో నమ్మకాన్ని ఉంచాము. కొవిడ్-19ను నియంత్రించేందుకు మద్ధతుగా ఉండే ఈ కార్యక్రమాలు ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాయి. మేము ఎన్జిఓ భాగస్వాములు మరియు స్థానిక పాలక సంస్థలతో ఆక్సిజన్ కేంద్రాలు, వైద్య పరికరాలు మరియు కొవిడ్ సంరక్షణ సదుపాయాలను నెలకొల్పేందుకు శ్రమిస్తున్నాము. రానున్న రోజుల్లో మేము విద్య మరియు జీవనోపాధి రంగాలకు ముఖ్యంగా కొవిడ్-19 బాధిత కుటుంబాలకు మద్ధతు ఇవ్వడంపై దృష్టి సారిస్తున్నాము మరియు అటువంటి దీర్ఘకాలిక సుస్థిర కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించే దిశలో పని చేస్తున్నామని'' వివరించారు.