Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమ పీపుల్ ఫస్ట్ సిద్ధాంతంతో, భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ సర్వీస్ కంపెనీగా వెలుగొందుతున్న జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్ (జెఎఫ్ఎల్) తమ 30వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం దేశ వ్యాప్తంగా టీకా కార్యక్రమం ఆరంభించింది. ఈ కంపెనీ ఈ కార్యక్రమం కోసం సుప్రసిద్ధ ఆస్పత్రులు అయినటువంటి అపోలో, ఫోర్టిస్ హెల్త్కేర్ మరియు ఇతర ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకూ 7040 ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్లను అందజేశారు. ఈ టీకా ఖర్చును జెఎఫ్ఎల్ భరించడంతో పాటుగా జెబీఎల్ బ్రాండ్స్లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ టీకాలను అందజేయనున్నారు.
ప్రస్తుత కోవిడ్–19 సెకండ్ వేవ్ సమయంలో తమ ఉద్యోగుల కోసం జెఎఫ్ఎల్ ప్రారంభించిన ఇతర కార్యక్రమాలు
· 24గంటల హెల్ప్లైన్ ; కోవిడ్ సంబంధిత మద్దతు అందించడం కోసం గ్రూప్ లెవల్ టాస్క్ఫోర్స్
· కోవిడ్ చేత ప్రభావితమైన ఉద్యోగులు, కుటుంబసభ్యులు ఔషదాలు పొందడం కోసం సదుపాయాలు
· ముంబై, బెంగళూరు, చెన్నై, నోయిడా, ఇండోర్లలో ఐసోలేషన్ కేంద్రాలు
· ఒకవేళ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అంకితం చేయబడిన అంబులెన్స్లు
· ఆస్పత్రిలో చేరేందుకు తగిన సహాయం, టీపీఏ అనుమతులు వేగంగా మంజూరు చేయడం
· సమగ్రమైన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం డాక్టర్లు మరియు కౌన్సిలర్లు తో కన్సల్టేషన్
· మృత్యువాత పడిన ఉద్యోగుల కుటుంబాలకు సహాయపడే రీతిలో సమగ్రమైన ప్యాకేజీ
· అన్ని స్టోర్లలోనూ పల్స్ ఆక్సీమీటర్, ఆర్ టీ పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు
· రెస్టారెంట్ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు భత్యాలు