Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు ఆన్లైన్ తిప్పలు తప్పడం లేదు. ఇది వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో తరుచుగా ఇబ్బందులు నెలకొనగా.. మంగళవారం బ్యాంక్ మొబైల్ యాప్ మొరాయించింది. ఉదయం 11.30 గంటల నుంచి ఖాతాదారులు చెల్లింపులు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 'మొబైల్ బ్యాంకింగ్ యాప్కు సంబంధించి సమస్యలు తలెత్తాయి. దీనిపై పని చేస్తున్నాం. ఖాతాదారులు... లావాదేవీల నిర్వహణ కోసం నెట్ బ్యాంకింగ్ ఉపయోగించాలి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం' అంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ ట్విట్టర్లో తెలిపారు.