Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని రషికా తౌఫిక్ మున్షీ, ఐసీఎస్ఈ 12వ తరగతి పరీక్షలలో 99% మార్కులతో రాష్ట్రంలో రెండవ ర్యాంకును సాధించింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఆమె సైన్స్ టాపర్. నగరంలోని నాసర్ స్కూల్ విద్యార్థిని అయిన రషికా 10వతరగతిలో కూడా డిస్టింక్షన్ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె జెఈఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆకాష్ ఎడ్యుకేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ ‘‘ఐసీఎస్ఈ 12 వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుతమైన ఫలితాలను సాధించిన మా విద్యార్థిని రషికాను అభినందిస్తున్నాను. ఆమె పడిన కష్టం, ఆమె తల్లిదండ్రులు అందించిన మద్దతు, ఆకాష్ వద్ద అందించిన నాణ్యమైన బోధన, మెంటారింగ్, మార్గనిర్దేశకత్వంకు ప్రతీక ఇది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న మా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలలో సైతం వారు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు. విద్యాపరంగా విజయం సాధించాలని తపిస్తున్న విద్యార్థులు విజయం సాధించడంలో సహాయపడటాన్ని ఆకాష్ ఇనిస్టిట్యూట్ లక్ష్యం చేసుకుంది. కరిక్యులమ్, కంటెంట్ డెవలప్మెంట్ కోసం కేంద్రీకృత అంతర్గత ప్రక్రియను ఇది కలిగి ఉండటంతో పాటుగా ఫ్యాకల్టీ శిక్షణ, పర్యవేక్షణను సైతం తమ నేషనల్ అకడమిక్ బృందం ద్వారా చేస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు పలు ఇంజినీరింగ్, వైద్య ప్రవేశ పరీక్షలలో రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో పాటుగా పోటీ పరీక్షలైనటువంటి ఎన్టీఎస్ఈ, కెవీపీవై, ఒలింపియాడ్స్లో సైతం విజయం సాధించారు.