Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే వారం నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచను న్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. స్టీల్, ఇతర విలువైన లోహాల, ముడి సరుకుల భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. గతేడాది నుంచి స్టీల్ ఇతర లోహల ధరల్లో గణనీయమైన పెరుగుదలను చూశామన్నారు. వివిధ వ్యయ తగ్గింపు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించగలిగామన్నారు. కాగా.. ఏ మోడల్పై ఎంత పెంచాలనే దానిపై కసరత్తు జరుగుతుందన్నారు.