Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ ఫార్మా సంస్థలలో ఒకటైన ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తమ నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ విశిష్ట నేపథ్యం కలిగిన వ్యక్తులను తమ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లకు జోడించింది. ఈ కంపెనీ ఇటీవలనే నలుగురు స్వతంత్య్ర డైరెక్టర్లను పలు రంగాలలో అపార అనుభవం కలిగిన వ్యక్తులను తీసుకుంది. ఈ నూతన స్వతంత్య్ర డైరెక్టర్లలో డాక్టర్ శైలేష్ అయ్యంగార్, విజయ్ గోఖలే, హితేష్ జైన్, డాక్టర్ విద్య ఎరవ్ద్ వాకర్ ఉన్నారు. ఈ సంవత్సరారంభంలో ఎమ్క్యూర్ బోర్డ్ ఛైర్మన్గా బెర్జిస్ దేశాయ్ బాధ్యతలను చేపట్టారు. ఈ కంపెనీ, 1997 నుంచి తమ స్వతంత్య్ర డైరెక్టర్ల నుంచి ఛైర్మన్ను నియమించుకునే మహోన్నత చరిత్ర కలిగి ఉంది. ఈ నూతన స్వతంత్య్ర డైరెక్టర్లు లీగల్, ఫార్మా, పాలసీ డెవలప్మెంట్, విద్యా రంగాలలో అపారమైన అనుభవం కలిగి ఉండటంతో పాటుగా ఎమ్క్యూర్ వృద్ధి పథంలో అదనపు వేగాన్ని అందించనున్నారు.
ఈ నియామకాలను గురించి సతీష్ మెహతా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవొ, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ మాట్లాడుతూ ‘‘మా బోర్డులో పలు రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను జోడించుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. నూతన సభ్యుల అనుభవం , ఆయా రంగాలలో వారి విజ్ఞానం మా వ్యూహాత్మక కార్యకలాపాలను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. మా నూతన బోర్డ్ సభ్యుల మద్దతుతో మరిన్ని నూతన శిఖరాలను చేరగలమని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.