Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే ఆన్లైన్ లావాదేవీలకు ప్రతీసారి పూర్తి వివరాలు సమర్పించేలా ఆర్బిఐ విధానాలు రూపొందిస్తోంది. కార్డుల వివరాలను పదే పదే సమర్పించడం ఎందుకని ఒకేసారి ఆయా సైట్లలో సేవ్ చేసి పెడుతుంటారు. కానీ వచ్చే కొత్త ఏడాది నుంచి అలా కుదరదు. వినియోగదారులు ఆన్లైన్లో చేసే ప్రతి లావాదేవీకి 16 అంకెల కార్డు నంబర్, సివివి, పేరు, కార్డు గడువు తేది నమోదు చేయాల్సి ఉంటుంది. 2022 జనవరి నుంచి దీనిని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ వేదికలపై యూజర్ల డేటాను స్టోర్ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనను ప్రవేశపెడుతున్నారు.