Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వివిధ భారతీయ బాషలలో అందుబాటులో ఉన్న మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కూ (Koo) యాప్ 1 కోటి (1 crore) డౌన్లోడ్ లను దాటింది. మార్చి 2020 లో ప్రారంభమైనప్పటి నుండి అతి వేగంగా యూజర్లు (Users) పెరుగుతున్నారు. ప్లాట్ఫామ్లో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు - సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, రచయితలు, పాత్రికేయులు వంటి ప్రముఖులు వారి అప్డేట్లను ఎనిమిది భాషల్లో పంచుకుంటూ వారి ఫాలోవర్స్ తో ప్రతిరోజూ కనెక్ట్ అవుతున్నారు.
సీరియల్ వ్యాపారవేత్తలు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్క ల సరికొత్త ఆలోచనలతో వచ్చిన కూ (Koo) ఇప్పుడు హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు, అస్సామీ, బంగ్లా మరియు ఇంగ్లీష్తో సహా 8 భాషలలో అందుబాటులో ఉంది. భారతదేశంలో మొదటిసారి ప్రారంభమైన ప్లాట్ఫామ్ కూ (Koo) ను ఇప్పుడు అనేక సాంకేతిక ఫీచర్స్ తో తీసుకువచ్చారు. కూ (koo) ఎక్కువ మంది భారతీయులు ఆన్లైన్ సంభాషణ లో పాల్గొనడానికి అవకాశం కల్పించి, తమను తాము వ్యక్తీకరించుకునేందుకు తోడ్పడుతుంది. ఒకే భాషలో ఒకే ఆసక్తులు ఉన్న కూ (koo) వినియోగదారులను కనుగొనడంలో సహాయపడటం ద్వారా కూ (Koo) వివిధ భాషా కమ్యూనిటీ యూజర్స్ (users) మధ్య కనెక్షన్ను బలపరుస్తుంది. రాబోయే కొన్ని నెలల్లో భారతీయులకు మరిన్ని ఫీచర్లను అందించడానికి కూ (Koo) సిద్దంగా ఉంది.
లక్షలాది మంది భారతీయులు వారి ఇష్టమైన భాషలో వారి ఆలోచనలను వ్యక్తీకరించుకోడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ను సృష్టించాలనే కలతో కూ (Koo) ప్రారంభించబడింది. మేము మార్చి 2020 లో ప్రారంభించినప్పటి నుండి, ప్రజల ప్రతి స్పందన చాలా బాగుంది. కూ (Koo) ఇప్పుడు 1 కోటి డౌన్లోడ్ లకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో కంటే భవిష్యత్తులో మన అభివృద్ధి మరింత వేగంగా ఉంటుంది. ‘ఆత్మనిర్భర్ డిజిటల్ ఇండియా’ కలను సాకారం చేయడానికి మరియు సాంకేతికత మరియు భాషల ద్వారా దేశాన్ని ఏకం చేయాలని కోరుకుంటూ, స్వదేశీ డిజిటల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తం కావడానికి మార్గం సులభం చేయడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము.
కూ (Koo) లో ఇప్పుడు చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అనుపమ్ ఖేర్, టైగర్ ష్రాఫ్, కంగనా రనౌత్ వంటి ప్రముఖ నటులు, ఎల్ బీ శ్రీరామ్, అనుష్క శెట్టి, తనికెళ్ళ భరణి, నాగ శౌర్య, ఈషా రెబ్బ; నితిన్ గడ్కరీ, కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, సుప్రియా సూలే, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, రవిశంకర్ ప్రసాద్, సంజయ్ సింగ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బసవరాజ్ బొమ్మై, హెచ్ డి కుమారస్వామి, భూపిందర్ సింగ్ హుడా మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి ప్రముఖ మంత్రులు మరియు రాజకీయ నాయకులు, మహమ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహా, ఆకాష్ చోప్రా, జవగల్ శ్రీనాథ్, సైనా నెహ్వాల్, అభినవ్ బింద్రా, రవి కుమార్ దహియా, మేరీ కోమ్ మరియు అనేక ఇతర క్రీడాకారులు. ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), రైల్వే మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మైగోవ్, డిజిటల్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ (BSNL), ఇండియా పోస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) కూ (Koo) లో ఇప్పుడు వారి ఆలోచనలు మనతో పంచుకుంటున్నారు.14 భారతీయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు - ప్రాంతీయ మరియు జాతీయ - మరియు మీడియా సంస్థలు కూడా కూ (Koo) లో చురుకుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ప్రభుత్వ శాఖలు చేసే అభివృద్ధి పనులు మరియు అప్డేట్లను భారతీయ భాషలలో పంచుకోడానికి తోడ్పడుతుంది.
క్రియేటర్స్ తమను తాము వ్యక్తీకరించుకోగలగడం మరియు వినియోగదారులు అనుకూలీకరించిన ఫీడ్ను సృష్టించడం కోసం తమకు నచ్చిన క్రియేటర్లను అనుసరించగలగడంతో యాప్ క్రియాశీల సంభాషణలను సులభతరం చేస్తుంది. బహుభాషా పరంగా భారతదేశ మొదటి వేదిక 2020 లో భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను గెలుచుకున్న ఈ యాప్ అన్ని వర్గాల నుండి ప్రశంసలను అందుకుంది.