Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని మోడళ్లపై ధరలు పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్ల వచ్చే నెల నుంచి అన్ని మోడల్స్ ధరలను పెంచనున్నట్లు సోమవారం ఆ కంపెనీ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వాహన ధరలను పెంచినట్లయ్యింది. గతేడాది కాలంలో ముడి సరుకుల వ్యయాలు పెరగడం వల్ల వివిధ వాహనాల ధరలు ప్రభావితం అవుతున్నాయని పేర్కొంది. ముడిపదార్ధాల ధరలు ఎగబాకడంతో కార్ల ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. ఏడాదిగా పలు ముడిపదార్ధాల ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయని పేర్కొంది. దీంతో వీటిలో కొంతమేర వినియోగదారుల మీద భారం మోపకతప్పలేదని పేర్కొంది. అయితే ఎంత మేర పెంచేది ఆ కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో ధర రూ.2.99 లక్షల నుంచి ఎస్-క్రాస్ ధర రూ.12.39 శ్రేణీలో వాహనాలను విక్రయిస్తోంది.