Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ మారుతి సుజుకి ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు కార్ల ధరలను పెంచింది. ఎంపిక చేసిన మోడల్స్పై ధరలను రెండు శాతం మేర పెంచినట్టు ఆ సంస్థ సోమవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారం కావడంతో ధరల పెంపు అనివార్యమయ్యిందని తెలిపింది. సెలెరియో మినహా అన్ని మోడళ్ల వాహనాలపై సగటున 1.9 శాతం చొప్పున ధరల పెంపునకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్లో ధరలు పెంచిన మారుతి సుజుకి తాజాగా మూడవ సారి కార్ల ధరలను పెంచింది. ఈ ఏడాది ఇప్పటికే మారుతి కార్ల ధరలు 3.5 శాతం మేర పెరిగాయి. మారుతి రూ 2.99 లక్షల విలువైన బేసిక్ లేవల్ అల్టో నుంచి లగ్జరీ సెగ్మెంట్లో రూ 12.39 లక్షలు పలికే ఎస్ క్రాస్ వరకూ పలు శ్రేణుల కార్లను విక్రయిస్తోంది.