Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తైగున్ అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాలను వినియోగదారులకు సాధ్యం చేస్తూ వోక్స్వ్యాగన్ ప్యాసెంజర్ కార్ ఇండియా, తమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్యువీడబ్ల్యు ప్రత్యేక ప్రివ్యూను హైదరాబాద్లో నిర్వహించింది. దక్షిణ భారతదేశంలో ఈ ప్రత్యేక ప్రివ్యూ జరుగుతున్న నాల్గవ నగరంగా హైదరాబాద్ నిలువగా, దేశంలో ఈ ఎక్స్క్లూజివ్ ప్రివ్యూ జరుగుతున్న 5వ నగరంగా ముంబై నిలిచింది. గతంలో బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరులలో ప్రివ్యూలను నిర్వహించారు. వోక్స్వ్యాగన్ తైగున్, బ్రాండ్ యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్యువీడబ్ల్యుగా నిలిచింది. దీనిని భారతదేశంలో 23 సెప్టెంబర్ 2021న పండుగ సీజన్ మధ్యలో విడుదల చేయనున్నారు.
ఈ ఎక్స్క్లూజివ్ ప్రివ్యూ సమయంలో, ఆసక్తి కలిగిన వినియోగదారులకు వోక్స్వ్యాగన్ తైగున్ అనుభవాలను ముందుగా సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనితో పాటుగా బ్రాండ్ ఇటీవలనే ప్రారంభించిన 360డిగ్రీ విజువలైజర్ అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. ఈ 360 డిగ్రీ విజువలైజర్తో తైగున్ ఫీచర్లను వినియోగదారులు సౌకర్యవంతంగా తమ ఇంటిలో ఉండే డిజిటల్గా అనుసంధానించబడిన ఉపకరణాలు అయినటువంటి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు లేదా డెస్క్టాప్స్తో చూడవచ్చు. అదనంగా, వినియోగదారులు తైగున్ పై లభ్యమయ్యే యాక్ససరీలకు సంబంధించిన సమాచారాన్ని సైతం పొందవచ్చు. తద్వారా తమ జీవనశైలి అవసరాలకు తగినట్లుగా తైగున్ ఏ విధంగా సరిపోతుందనే అంశాన్ని వార ముందుగానే తెలుసుకునే అవకాశమూ కలుగుతుంది.
ఈ సందర్భంగా అశీష్ గుప్తా, బ్రాండ్ డైరెక్టర్, వోక్స్వ్యాగన్ పాసెంజర్ కార్స్ ఇండియా మాట్లాడుతూ ‘‘దక్షిణ భారతదేశపు మార్కెట్ వోక్స్వ్యాగన్కు అత్యంత ముఖ్యమైన మార్కెట్ ఐటీ కేంద్రంగా నిలిచిన హైదరాబాద్లో మా ఎక్స్క్లూజివ్ ప్రివ్యూ నిర్వహించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో మా అమ్మకాలకు గణనీయమైన తోడ్పాటును ఈ రాష్ట్రం అందిస్తుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్యువీడబ్ల్యు, తైగున్ను ప్రదర్శించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది దేశవ్యాప్తంగా 23 సెప్టెంబర్ 2021 న తైగున్ను ఆవిష్కరించడానికి మునుపే తైగున్ అనుభవాలను సొంతం చేసుకునే అవకాశం వీరికి అందిస్తుంది’’ అని అన్నారు. తమ విలువ ప్రతిపాదన వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయడానికి వోక్స్ వ్యాగన్ ఇండియా అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. ఈ బ్రాండ్ గత కొద్ది నెలలుగా తమ నెట్వర్క్ ఉనికిని బలోపేతం చేసుకోవడంతో పాటుగా తమ నూతన బ్రాండ్ డిజైన్, లోగోను భారతదేశ వ్యాప్తంగా తమ డీలర్షిప్ల వద్ద ప్రదర్శిస్తుంది. ఈ నూతన డిజైన్ భాష, బ్రాండ్ యొక్క ప్రకాశవంతమైన, ఆధునిక, వినూత్నమైన, డిజిటలైజ్డ్ మరియు మానవీయ ఔట్లుక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. వినియోగదారులు మా పీపీఎస్ మోటర్స్, మోడీ ఆటో డీలర్షిప్ను నూతన వోక్స్వ్యాగన్ అనుభవాలను సొంతం చేసుకోవడం కోసం సంప్రదించవచ్చు.
మరింతగా వినియోగదారుల అనుభవాలను వృద్ధి డీచేసేందుకు వోక్స్వ్యాగన్, డిజిటలైజ్డ్ కార్యక్రమాల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టింది. ఇది బ్రాండ్ను మరింతగా అందుబాటులోకి తీసుకువస్తుంది. తమ సర్వోత్తమం 2.0 కార్యక్రమం కింద, ఈ బ్రాండ్40కు పైగా పరిష్కారాలను గుర్తించడంతో పాటుగా వినియోగదారుల ప్రయాణాన్ని మరింత సరళీకృతం చేసే ప్రక్రియలను డిజిటలైజేషన్, ప్రజా అభివృద్ధి ద్వారా తీసుకువస్తూనే, మెరుగైన కస్టమర్ కనెక్ట్ను మారుతున్న ప్రాధాన్యతలకనుగుణంగా అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద తీర్చిదిద్దిన పరిష్కారాలలో 360 డిగ్రీ విజువలైజర్, టెస్ట్ డ్రైవ్ షెడ్యూలర్, సర్వీస్ కామ్, బిజినెస్ కోసం వాట్సాప్,పేపర్ రహిత డాక్యుమెంటేషన్, కార్ హెల్త్ రిపోర్ట్, మరెన్నో ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా వోక్స్వ్యాగన్ తైగున్ ను సొంతం చేసుకునే అనుభవాలను మరింతగా పెంచుతాయి. ఈ కార్లైన్లో చూడగానే ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్, డిజిటల్ కాక్పిట్, 40కు పైగా భద్రతా ఫీచర్లతో సహా ప్రీమియం ఇంటీరియర్స్ తో ఆకర్షణీయమైన డిజైన్ భాష ఉంది. అత్యున్నత నిర్మాణ నాణ్యత, భద్రత, వినోదాత్మక సవారీ అనుభవం అనే బ్రాండ్ యొక్క కీలకమైన డీఎన్ఏను తైగున్ నిలుపుకుంది. దీనిలో అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన వోక్స్వ్యాగన్ యొక్క టీఎస్ఐ సాంకేతికత ఉంది.
ఇది రెండు ఇంజిన్ అవకాశాలు: 7 స్పీడ్ డీఎస్జీతో మిళితం చేసిన 1. 5 లీటర్ టీఎస్ఐ, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్; 6 స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మిళితం చేసిన 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ తో లభిస్తుంది.