Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే అక్టోబర్ 1వ తేది నుంచి 2 శాతం వరకు ధరలను పెంచనున్నట్టు పేర్కొంది. ఆయా వేరియంట్లు, మోడళ్లను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్లే వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. ఉక్కు, విలువైన లోహాలు వంటి ముడిసరకుల వ్యయం నిరంతరం పెరగడం వల్ల ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుందని పేర్కొంది. గత నెలలో తన ప్రయాణికుల వాహనాల ధరలను సగటున 0.8 శాతం పెంచిన విషయం తెలిసిందే.