Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల ఆందోళన
న్యూఢిల్లీ: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం నెలకొంది. బుధవారం పలు నగరాల్లో సేవలు నిలిచిపోవడంతో సోషల్ మీడియా ట్విట్టర్లో వినియోగదారులు అసహనం, ఆందోళన వ్యక్తం చేశారు. నెట్వర్క్ సరిగ్గా పని చేయలేదంటూ 'జియోడౌన్' పేరుతో ట్రెండింగ్ చేశారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్ వంటి పెద్ద నగరాల్లో చాలా మంది జియో నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై జియోకేర్ ట్విట్టర్లో స్పందిస్తూ సమస్య పరిష్కారానికి టెక్నికల్ బృందం ప్రయత్నిస్తుందని తెలిపింది.