Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ఆఫర్
న్యూఢిల్లీ : ప్రముఖ అంతర్జాతీయ సరకు రవాణ సేవల సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ప్రస్తుత పండగ సీజన్లో భారత వినియోగదారులకు రాయితీ ఆఫర్ను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. భారత్ నుంచి ఇతర దేశాలకు పంపే సరుకుపై ఇది వరకు ఎప్పుడూ లేనంతగా 40 శాతం తగ్గింపును ఇస్తున్నట్టు వెల్లడించింది. దీపావళి ఆఫర్లో భాగంగా 2-20 కిలోల బరువు కలిగిన సరుకుల ఈ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ 6 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.