Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ రిటైల్ స్టోర్ల సంస్థ డిమార్ట్ సిఇఒ ఇగేషియస్ నావిల్ నోరోన్హా బిలియనీర్ల క్లబ్లోకి చేరారు. డీమార్ట్లో నోరోన్హా 2.02 శాతం వాటా ఉంది. ఆయన ఈ విలువ రూ.7,720 కోట్లకు చేరింది. ఇటీవలి కాలంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం నోరోన్హా భారత్లో అత్యంత ధనవంతులైన ప్రొఫెషనల్ మేనేజర్గా నిలిచారు. ఆయన డిమార్ట్లో చేరకముందు హిందుస్తాన్ యూనిలీవర్లో పని చేశారు. అవెన్యూ సూపర్మార్ట్స్ స్థాపించిన వెంటనే రాధాకిష్ణన్ దమాని 2004లో నోరోన్హాను డిమార్ట్ సిఇఒగా నియమించారు.