Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేళ్ల తర్వాత తిరిగి స్టేడియం బాట పట్టబోతున్న కబడ్డీ
నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్, ఈ రోజు కూ(Koo) లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు ప్రకటించింది.వారి మొదటి కూ(Koo)గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ డిసెంబర్ 2021 న కబడ్డీ సీజన్ స్టార్ట్ కాబోతుందని ప్రకటించారు. తెలుగు టైటాన్స్ కూ(Koo) చేస్తూ, "ఆత్మ విశ్వాసం అనేది ఈ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా చాల అవసరం, మీరు చేయగలరని మీరు అనుకోకపోతే, మీరు చేయలేరు. మేము వచ్చేస్తున్నాం...@Telugu_Titans. #idiaatakaaduveta #AbKooPeKabaddi”. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమవుతున్న కొత్త సీజన్ గురించి వీడియోలో వీక్షకులకు సందేశం ఉంది. తెలుగు టైటాన్స్ ఎంట్రీతో కబడ్డీ చర్చలకు కూ(Koo) ఒక వేదిక కానుంది. "కూతకుసిద్దం" అంటూ పోస్ట్ చేసి వాళ్ళు సిద్ధంగా వున్నారు అని అభిమానులకు తెలిపారు.