Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్ తదితర కమోడిటీ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చుని నొమురా పేర్కొంది. డిసెంబర్ 2021 వరకు ఇదే పరిస్థితి కొనసాగితే వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) అదనంగా ఒక్క శాతం పెరుగొచ్చని హెచ్చరించింది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచొచ్చని తెలిపింది. గడిచిన ఆగస్టులో ముడి చమురు బ్యారెల్ ధర 65 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 85 డాలర్లకు చేరింది. సహజ వాయువు ధరలో ఏకంగా 26 శాతం పెరుగుదల ఉంది. వచ్చే ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం 6.5-7 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని జెఎం ఫైనాన్సీయల్ మేనేజింగ్ డైరెక్టర్ ధనంజరు సిన్హా పేర్కొన్నారు. అధిక ధరలు డిమాండ్ను దెబ్బతీయొచ్చని తెలిపారు.